(హైదరాబాద్,న్యూస్ఇన్)
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృతితో రగిలిపోయిన ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేశారు.నాలుగు దశాబ్దాలకు పైగా ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఎంతో భావోద్వేగంతో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాదేండ్ల భాస్కర్ రావ్ సంక్షోభం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి తాజా రాజకీయ పరిణామాలతో ఆ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన పార్టీలో నెలకొన్న పరిస్థితులతో గత కొన్ని నెలలుగా అవకాశం వచ్చినప్పుడల్లా రాజకీయంగా ఆందోలన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇన్ని అవమానాలు భరించి ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా అన్న వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డిని పార్టీ ని వీడకుండా చూసేందుకు ఆ పార్టీ హై కమాండ్ గత వారం రోజులుగా పావులు కదిపింది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐససీ తరపున మాజీ ఎమ్మెల్యే వంశీశంద్ రెడ్డి లు జీవన్ రెడ్డితో వేర్వేరుగా చర్చలు జరిపినా ఆ ఫలించలేదు. 25వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ముందుగానే చెప్పిన ఆయన ఈ రోజు తాను కాం్గరెస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు.

కరీంగనర్ జిల్లా నేతల కయ్యాలు…….
రాష్ట్రంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి ఎదురులేని రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి కాంగ్రెస్ కు జీవం పోశారు. ఆ తరువాత 2023 ఎన్నికల నుంచి పార్టీ నుంచి ఆశించిన మద్దతు జీవన్ రెడ్డికి దక్కలేదు. ఎన్నికల అనంతరం జగిత్యాలలో బీఆర్ ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించినా సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకోవడం మొదలయ్యాయి. పార్టీ పెద్దల నుంచి ఏ మాత్రం సహకారం లభించకపోవడం, మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ అనుచరులకే టికెట్లు కేటాయించడం, ప్రభుత్వం పరంగా ఎమ్మెల్యేకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలు ఆయన అసంతృప్తికి కారణమయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం దక్కుతుందని అంచనా వేసినా….పరిస్థితి ఏమత్రం కలిసి రాలేదు. దీంతో గత కొన్ని రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.
బీఆర్ఎస్ కే నా…..

ఇక జగిత్యాలలో ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించిన సంజయ్ కు బీఆర్ ఎస్ కీలక నేతలు పూర్తి స్థాయిలో సహకరించారు. పట్టున్న ఆ ప్రాంతంలో విజయం దక్కించుకునేందుకు జీవన్ రెడ్డిని ఓడించేందుకు కల్వకుంట్ల కవిత అక్కడే మకాం వేసి సంజయ్ విజయం కోసం శ్రమించారు. పార్టీ పెద్దలు కూడా సామాజిక సమీకరణ నేపథ్యంలో ప్రభుత్వంలో ఆయనకు అత్యంత ప్రాధన్యతనిచ్చారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ ఎస్ కూడా ఒక్క షాక్ గురైనంత పనైంది. కానీ ఇప్పుడు సంజయ్ కు రాజకీయంగా బలమైన నాయకుడుగా ఉన్న జీవన్ రెడ్డిని కారెక్కించుకునేందుకు రెడీ అవుతోంది. అప్పట్లో సంజయ్ కు ఇచ్చిన ప్రాధాన్యత కంటే సీనియర్ నేతగా జీవన్ రెడ్డికి ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు జీవన్ రెడ్డిని ఒక అస్త్రంగా గులాబీ పార్టీ వాడుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇక త్వరలో సీనియర్ నేత కారెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నేతలు కూడా సీనియర్ నేతను బీజేపీలోకి ఆహ్వానించినా ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలిసింది.





Leave a Reply