(హైదరాబాద్,న్యూస్ఇన్)
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ప్రధానంగా చమురు ఉత్పత్తులపై ఎక్కువగా పడుతుండడంతో ప్రజల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. దాదాపు 3 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటనలు చేస్తున్నా….ప్రజల్లో మాత్రం అనుమానాలు వీడడం లేదు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్ లవద్ద బారులు తీరుతున్నారు. కొన్ని పెట్రోల్ బంక్ లు మూత పడుతున్నాయి. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. రవాణా చార్జీల భారం కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా నగరంలో ఆటోల సంఖ్య తగ్గిపోతోంది. ఉన్న ఆటో డ్రైవర్లు కూడా చార్జీలు రెట్టింపు చేస్తున్నారు. పెట్రో ఉత్త్పత్తుల ధరలు పెంచకపోయినా…రోజంతా పెట్రోల్ బంక్ ల వద్ద సమయం గడిచి పోతుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈకారణంగానే ఆటో చార్జీలు పెంచక తప్పడం లేదంటున్నారు.

సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్ ధరల్లో భారీగా తేడాలు ఉన్నాయి. ప్రభుత్వ గ్యాస్ ఏజన్సీల ద్వారా సరఫరా చేసే బంకులు తక్కువగా ఉండడం, ప్రైవేటు గ్యాస్ ఏజన్సీలు ఎక్కువగా ఉండడంతో గ్యాస్ ధరల్లో కిలోకు దాదాపు 10 రుపాయలు ప్రైవేటు గ్యాస్ ఏజన్సీలు ధరలు పెంచాయని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఈ కారణంగానే ప్రయాణికులపై భారం మోపక తప్పడం లేదని ఆటో డ్రైవర్ల అభిప్రాయం. ఇక పెట్రో ఉత్పత్తులకు హర్ముజ్ సలసంధిలో భారత్ వెళ్లే నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా…. డిమాండ్ కు సరిపడా చమురు అందడం లేదు. చమురు నిల్వలు లేవన్న ప్రచారంతో పెట్రోల్ బంక్ ల సమీపంలో వేలాది మంది వాహనదారులు ఒకే సారి పెట్రోల్ కోసం పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక పెట్రో ఉత్పత్తుల ధరలను గ్యాస్ కంపెనీలు పెంచడం మొదలు పెట్టాయి. కేవలం పవర్ పెట్రల్ పైనే ధరలు పెంచినా చమురు సంస్థ నయారా ఎనర్జీ తమ పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. లీటరు పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 చొప్పున పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.

దీంతో మిగిలిన సంస్థలు కూడా ధరలు పెంచే అవకాశం ఉందని చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన సంస్థలు కూడా ఏ క్షణమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. చమురు సంస్థలు ధరలు పెంచడం మొదలు పెట్టడంతో ఈ ప్రభావం అన్ని రంగాలపై పడనుంది. నిత్యావసర వస్తువులు సహా అన్నింటి ధరలు మరికొన్ని రోజుల్లోనే కొండెక్కే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణా ప్రజలకు సీఎం గుడ్ న్యూస్……





Leave a Reply