NewsInn

News in a Click

వైభ‌వంగా శ్రీరామ న‌వ‌మి ఉత్స‌వాలు

వైభ‌వంగా శ్రీరామ న‌వ‌మి ఉత్స‌వాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

శ్రీరామ న‌వ‌మి ని దేశంలో ప్ర‌జ‌లు ఘనంగా జ‌రుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘ‌నంగా శ్రీరామ న‌వ‌మిని జ‌రిగింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భ‌ద్రాచ‌లంలో జ‌రిగిన శ్రీరామ న‌వమి ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. భ్ర‌దాచ‌ల ఆలయం అభివృద్ధి ప‌నుల‌కు సీఎం శంకుస్థాప‌న చేశారు. మొద‌టి విడ‌త‌లో351 కోట్ల రుపాయాల‌ను ప్ర‌భుత్వం ఇటీవ‌లే మంజూరు చేసింది. గోదావ‌రి పుష్క‌రాల నాటికి తొలివిడ‌త ప‌నుల‌ను పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంగా ప‌నులు మొద‌లు పెట్టాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

అనంత‌రం జ‌రిగిన శ్రీ సీతారామ‌చంద్ర‌మూర్తి క‌ళ్యాణోత్స‌వంలో ముఖ్య‌మంత్రి దంప‌తులు పాల్గొన్నారు. సీఎం దంప‌తుల‌కు ఆల‌య అర్చ‌కులు స్వాగ‌తం ప‌లుకుగా…. ప‌ట్టు వ‌స్తాల‌ను, ముత్యాల త‌లంబ్రాల‌ను స్వామి వారికి సీఎం దంప‌త‌లు స‌మ‌ర్పించారు. మిథిలా స్టేడియంలో జ‌రిగిన క‌ళ్యాణోత్స‌వం అభిజిత్ ల‌ఘ్నంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో సీఎంతో పాటు మంత్రులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పాల్గొన్నారు.

తెలుగురాష్ట్రాల్లో భ్ర‌దాచ‌లం ఆల‌యంలో జ‌రిగే సీతారాముల క‌ళ్యాణానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. తెలుగురాష్ట్రాల‌కు చెందిన భ‌క్తులు క‌ళ్యాణాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు హాజ‌ర‌వుతారు. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాచ‌ల ఆల‌యంలో ప్ర‌త్యేకంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఈ రోజు క‌ళ్యాణం త‌రువాత శ్రీరామ ప‌ట్టాభిషేకం నిర్వ‌హిస్తారు. ఇక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భ‌క్తుల సౌక‌ర్యం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున భ‌క్తులు హాజ‌రు కానున్న‌నేప‌థ్యంలో త‌లంబ్రాలు, ప్ర‌సాదాల పంపిణీకి ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట‌లో కూడా శ్రీరామ న‌వ‌మి ఉత్స‌వాల సంద‌ర్భంగా ధ్వ‌జా రోహ‌ణం చేశారు. రాత్రి 7 గంట‌ల‌కు అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు జ‌రుగ‌నున్నాయి.

హైద‌రాబాద్ లో శోభాయాత్ర‌…..

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో శ్రీరామ న‌వ‌మి శోభాయాత్ర సాగుతోంది. సీతారాం బాగ్ లో మొద‌లైన శోభ‌యాత్ర‌ను గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ట్రాఫిక్ ఇబ్బందులు, ఎలాంటి స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా పోలీసులు అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వ‌ర్యంలో క‌రీంన‌గ‌ర్ లో కూడా ఎంతో వైభ‌వంగా సీతారాముల క‌ళ్యాణం జ‌రిగింది.బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన సీతారాముల క‌ళ్యాణంలో పాల్గొన్నారు. .

అయోధ్య‌లో సూర్య తిల‌కం…..

అయోధ్య‌లో శ్రీరామ న‌వ‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. బాల రాముడికి నుదుడిపై సూర్య తిల‌కం 4 నిమిషాలు సూర్య‌తిల‌కం, తిల‌కంలా క‌నిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ దృష్యం ప్ర‌త్య‌క ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. దేశ వ్యాప్తంగా దీన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది వీక్షించారు. స‌రిగ్గా 12 గంట‌లకు సూర్య తిల‌కం క‌నిపించేలా శాస్త్ర‌వేత్త‌లు ఏర్పాట్లు చేశారు. ప్ర‌ధాని మోడీ సైతం ఆన్ లైన్ లోనే ఆయోధ్య బాల‌రాముడి నుదిడి పై ప‌డిన సూర్య‌తిలకాన్ని ద‌ర్శించ‌కున్నారు. శ్రీరామ న‌వమి సంద‌ర్భంగా ఈ అద్భుత ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది.

హైద‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *