NewsInn

News in a Click

క‌విత కొత్త రాజ‌కీయ పార్టీ – ముహూర్తం ఖ‌రారు

క‌విత కొత్త రాజ‌కీయ పార్టీ – ముహూర్తం ఖ‌రారు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో మ‌రో రాజ‌కీయ పార్టీ త్వ‌ర‌లో ఏర్పాటు కానుంది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురైన బీఆర్ ఎస్ అధినేత కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కొత్త రాజ‌కీయ పార్టీ దారిని ఎంచుకున్నారు. బీఆర్ ఎస్ లో నెల‌కొన్న ప‌రిణామాల‌పై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆమె కొత్త రాజ‌కీయ పార్టీ సాధించి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌న్న ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నారు. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్బంగా త‌న సొంత గ్రామం నిజ‌మాబాద్ జిల్లాలో ప‌లు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం సాయంత్రం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి పార్టీ ఎందుకు అవ‌స‌ర‌మో తేల్చి చెప్పారు.

తెలంగాణా ఆవిర్భావం త‌రువాత కూడా అనుకున్న ఫ‌లితాలు ఏ వ‌ర్గాల‌కు అంద‌లేద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మ‌గ‌వాళ్లు పెట్టిన రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌లు చూశారు…ఇక మ‌హిళా నాయ‌క‌త్వంలో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళుతుందో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. రాష్ట్ర భవిష్య‌త్తు కోసం జాగృతి ప్ర‌తినిధులు, మేధావుల‌తో ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేశామ‌న్నారు. ఏప్రిల్ 25వ తేదీన పార్టీ ప‌తాకాన్ని ఆవిష్క‌రిస్తామ‌న్నారు. న‌గ‌ర శివారుల్లోని మునిరాబాద్ లో భారీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. ఉద‌యం 10 గంట‌ల‌కు కొత్త పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ ఉంటుంద‌ని అన్ని గ్రామాల నుంచి కార్య‌క‌ర్త‌లు, మ‌హిళ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 25న పార్టీ ప‌తాకావిష్క‌ర‌ణ‌….

తెలంగాణా రూపు రేఖ‌ల‌ను మార్చ‌డం, సామాజిక తెలంగాణా సాధించ‌డం ల‌క్ష్యంగా అన్ని వ‌ర్గాల‌ను రాబోయే నెల రోజుల్లో క‌లుసుకుంటామ‌న్నారు. కాశీకి వెళ్లి వ‌చ్చి 25వ తేదీన పార్టీ పేరు, జెండా, అన్ని వివ‌రాలు ఆరోజే వెల్ల‌డిస్తామ‌న్నారు. స్థానిక నేత‌గా నిజ‌మాబాద్ నుంచి ఈ విష‌యాన్ని వెల్ల‌డించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. నిజామాబాద్ ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశంతోనే తాను జాతీయ స్థాయిలో గుర్తింపు నిచ్చార‌ని, తాను స్వ‌యంగా ఏర్పాటు చేయ‌బోయే రాజ‌కీయ పార్టీని స్థాపించ‌బోతున్నాన‌ని దీనికి కూడా మీ ఆశిర్వాదం కావాల‌ని కోరారు.

ప్ర‌శ్నించే పార్టీ కావాలి……

రాష్ట్ర ప్ర‌జ‌లకు ప్ర‌శంసించే రాజ‌కీయం అవ‌స‌రం లేద‌ని, ప్ర‌శ్నించే రాజ‌కీయ పార్టీ అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. జాగృతి ఆధ్వ‌ర్యంలో తెలంగాణా వ్యాప్తంగా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వాళ్లు బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌మ పార్టీ స‌హించ‌బోద‌న్నారు. జాగృతి సంస్థ ఏదైన స‌మ‌స్య‌ను తీసుకుంటే దాన్ని ప‌రిష్క‌రించేంత వ‌ర‌కు పోరాడుతామ‌న్నారు. నా పార్టీ ఏ రాజ‌కీయ పార్టీకి బీ పార్టీ కాద‌ని…. నంబ‌ర్ వ‌న్ పార్టీ అవుతుంద‌న్నారు.

క‌విత కొత్త పార్టీ గురించి తెలుసుకోవాల‌నుందా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *