- సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవ పథకాన్నిఅడ్డుకునే ప్రతిపక్షాలపై శివతాండవం లాగానే రేవంత్ తాండవం చూడాల్సి వస్తుందనినని సీఎం హెచ్చరించారు ఇది మా ప్రభుత్వ శివదీక్ష అని వ్యాఖ్యలు చేశారు. పునరుజ్జీవ పథకంలో భాగంగా 1400 ఏల్ల చరిత్ర ఉన్న మంచిరేవుల వీరభద్ర స్వామి ఆలయాన్ని పునః నిర్మాణం చేస్తూ కాక తీయ కట్టడంగా నిర్మాణం చేసే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు మూసీని పునరుజ్జీవం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని అవి సాధ్యం కాలేదన్నారు.

తమ ప్రభుత్వం ఈ దైవేచ్చతో కార్యక్రమం మొదలు పెట్టి పూర్తి చేయాలన్న లక్ష్యంగా ఉందన్నారు. కలుశిత మూసీ జలాల స్థానంలో కలుశితం లేని గోదావరి జలాలను పారిస్తామన్నారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. దక్షిణ కాశీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు.
ఓంకారేశ్వర దేవాయాన్ని 800 కోట్ల తో అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో దీన్ని ఒక టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసేందుకు ఇక్కడ మూసీ నది మధ్యలో 108 అడుగుల శివుడి విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టాపన చేయనుంది. ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేసి, పర్యాటక ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సబిత అక్కా అంటూనే సీఎం చురకలు……
ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. అక్క కుటుంబం ఇక్కడి ప్రజల సహకారంతో అన్ని పదవులు అనుభవించిందని, ఇప్పుడు ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొడుకు కార్తిక్ రెడ్డితో ఎన్జీటిలో కేసు వేయించిదన్నారు.ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేసును వెంటనే ఉపసంహరింప చేసేలా కొడుకు నచ్చచెప్పాలన్నారు. ఇక్కడున్నప్పుడు అక్క బాగానే ఉంది కానీ….అక్కడికి వెళ్లి కుట్ర రాజకీయాల్లో భాగం అవుతందన్నారు.ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని సీఎం కోరారు.
మూసీలో శివుడి భారీ విగ్రహం……










Leave a Reply