
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మూసీ సుందరీ కరణ పేరుతో ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను సేకరించాలని నిర్ణయం తీసుకోవడాన్నిమాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తప్పు బట్టారు. మంచిరేవుల లో ఓంకారేశ్వర దేవాలయం పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి సబిత రెడ్డితో పాటు ఆమె తనయుడు కార్తిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును ఆడ్డుకుంటే తన శివతాండవం చూడాల్సి వస్తోందని హెచ్చరించారు. దీంతో పాటు సబితక్క కొడుకు ఎన్జీటీలో వేసిన కేసును ఉపసంహరించేలా చూడాలన్నారు. దీనిపై సబిత స్పందిస్తూ ప్రభుత్వం తీసుకున్న సుందరీ కరణను తాము ఆహ్వానిస్తామని, అయితే ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్తిక్ రెడ్డి కూడా దీనిపై సీఎం రేవంత్ కు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. పేద ప్రజల ఇళ్లూ కూలగొడుతా అంటే ప్రజల కోసం ఎక్కడి కైనా వెళ్తా అని స్పష్టం చేశారు.
సబితపై సీఎం రేవంత్ ఏం మాట్లాడారంటే…..









Leave a Reply