
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఎర్త్ అవర్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సచివాలయంలో రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ దీపాలను పూర్తిగా నిలిపివేశారు.“Give An Hour For Earth” నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయం ప్రధాన భవనం, వివిధ కార్యాలయ గదులు, హాళ్లలోనూ లైట్లు ఆర్పివేసి పర్యావరణ చైతన్యాన్ని ప్రదర్శించారు.ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు. చీకట్లో సచివాలయం అందాలు మీరు చూడండి












Leave a Reply