NewsInn

News in a Click

కేంద్రం కోర్టులోకి అమ‌రావ‌తి బంతి

కేంద్రం కోర్టులోకి అమ‌రావ‌తి  బంతి

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

ఏపీ రాజ‌ధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రుభుత్వం ఏపీ శాస‌న‌స‌భ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించింది. సభలో విభజన చట్టంలో సవరణ చేయాలని తీర్మానం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో పాటు ఈ తీర్మానంపై ప్ర‌సంగించారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5లోని సబ్‌సెక్షన్‌ 2లో ‘ఎట్‌ అమరావతి ’ అన్న పదాన్ని చేర్చాలని ఏపీ శాస‌న‌స‌భ తీర్మానం చేసంది.. రాజధానిగా అమరావతి పేరుని గతంలో టీడీపీ ప్రభుత్వం ఖరారు చేసింది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో…. అమ‌రావ‌తి రాజ‌ధాని అంశాన్ని సీరియ‌స్ గా తీసుకోలేదు. స్తానికంగా ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో అమ‌రావ‌తి రాజ‌ధానిగా సాధ్యం కాద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చింది. మూడు రాజ‌ధాన‌లుగా ఏపీకి ఏర్పాటు చేస్తామ‌ని వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది.

కాని ఆ త‌రువాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో మ‌రోసారి తెలుగుదేశం పార్టీ కూట‌మి ప్ర‌భుత్వంగా ఏర్పాటు కావ‌డంతో మ‌రోసారి అమ‌రావ‌తి అంశాన్ని తెర‌పైకి తెచ్చింది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేయాల‌న్న పాత నిర్ణ‌యానికి అనుగుణంగా కేంద్రంపై వ‌త్తిడితో అమ‌రావ‌తి రాజ‌ధానిగా చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వం కోర్టులోకి అమ‌రావ‌తి రాజ‌ధాని అంశాన్ని తీసుకెళ్లింది. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం కూడా సానుకూలంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే అమ‌రావ‌తి రాజ‌ధానిగా చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *