NewsInn

News in a Click

మైనింగ్ స్కాం పై సీబీ’ఐ’ కి సిద్ద‌మా…రేవంత్ రెడ్డి

పొంగులేటిని బ్లాక్ మేయిల్ చేసేందుకే క‌మిటీ డిమాండ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హౌస్ క‌మిటీ డిమాండ్ చేయ‌డం వెనుక బ్లాక్ మేయిల్ రాజ‌కీయం మాత్ర‌మే అని ఆరోపించారు.శాస‌న‌స‌భా క‌మిటీ వేస్తే క‌మిటీలోకి వ‌చ్చి హ‌రీష్‌రావ్ పొంగులేటిని ధ‌ర‌ణిపై బ్లాక్ మేయిల్ చేసి కేసుల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో భాగంగానే బీఆర్ ఎస్ ఆ డిమాండ్ చేస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శాస‌న‌స‌భ హౌస్ క‌మిటీల విచార‌ణ‌తో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయ ప‌డ్డారు. శాస‌న‌స‌బ క‌మిటీలు కేవ‌లం శాస‌న‌స‌భా ప‌తికి మాత్ర‌మే నివేదిక‌లు ఇస్తార‌ని చెప్పారు. ఆ త‌రువాత స్పీక‌ర్ మ‌ళ్లీ పోలీసు శాఖ‌కే విచార‌ణ బాద్య‌త‌లు అప్ప‌గిస్తుంద‌న్నారు.ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని సిబీసిఐడి విచార‌ణ‌కు తాము ఆదేశించిన‌ట్లు సీఎం తెలిపారు. హ‌రీష్- కేటిఆర్ మ‌ధ్య జ‌రిగిన గోడ‌వ కార‌ణంగా స‌భను న‌డిపించ‌కుండా అడ్డుకున్నారన్నారు. బీఆర్ ఎస్ ద‌గ్గ‌ర ఆధారాలుంటే సీబీసీఐడి విచార‌ణ అధికారుల‌కు ఎలాంటి అనుమానాలు లేకుండా ఇవ్వ‌వ‌చ్చ‌న్నారు. సీబీసీఐడి విచార‌ణ‌పై బీఆర్ ఎస్ కు అభ్యంత‌రాలు ఉంటే సీబిఐ విచార‌ణకు డిమాండ్ చేస్తే ఆ విచార‌ణ‌కు కూడా ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని సీఎం వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *