
- ఎథిక్స్ కమిటీకి కౌషిక్ వ్యవహారం సిఫారసు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీఆర్ ఎస్ లో వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న కౌషిక్ రెడ్డి వ్యవహారం అసెంబ్లీలో దూమారం రేపింది.అధికార పార్టీ నేతలు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. కౌషిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌషిక్ రెడ్డి పై అసెంబ్లీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జరుగుతున్ప పరిణామాలపై స్పందించారు. బీఆర్ ఎస్ శాసనసభ్యులు సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తే సభలో ఉంచండి లేదంటే రెండు రోజులు శాసనసభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, కౌషిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టడంతో సభ ఆమోదించింది. దీంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.బీఆర్ ఎస్ శాసనసభ్యులైన అనీల్ జాదవ్, తన్నీరు హరీష్, రావ్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, కౌషిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావ్, బండారు లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావ్, పద్మారావ్, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పట్లోళ్ల సబితా, సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునితా లక్మారెడ్డిలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రతిపాదించడంతో సభ ఆమోదించింది.






Leave a Reply