NewsInn

News in a Click

మాజీ సీఎం కేసిఆర్….సీఎం రేవంత్ క‌లిసి పోయారు

కేంద్ర మంత్రి బండి సంజయ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్కక్కు ఆయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే కేటీఆర్ పైనున్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదని చెప్పారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్ సయోధ్య కుదుర్చేందుకు రేవంత్ రెడ్డి మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నరని తెలిపారు. కేవలం హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయపటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితం అయ్యారని చెప్పారు. కేటీఆర్ పై రేవంత్ కు చాలా ప్రేమ ఒలకపోస్తున్నాడు. కేటీఆర్, కవిత మధ్య సంధి కుదర్చేందుకు యత్నిస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. 100 శాతం కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటే.కేసీఆర్ పై ఉన్న కోపం కూడా రేవంత్ కు పోయింది. ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. అందుకే హరీష్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారే తప్ప కేటీఆర్ గురించి మాట్లాడటం లేదు. పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంది…. దోచుకున్నారు..ఇగ మేం దోచుకుంటాం.. నోరు మెదపవద్దు. అని భయపెట్టడానికే ఈ తూతూ మంత్రపు విచారణ అని రేవంత్ చెబుతున్నారని సంజ‌య్ ఆరోపించారు.

డీలిమిటేషన్ పై….

డీలిమిటేషన్ చేస్తామనే సరికి, 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పే సరికి రేవంత్ రెడ్డిలో డిప్రెషన్ మొదలైంది. దక్షిణాది, ఉత్తరాధి అనే తేడా ఉండదు. బీజేపీకి అన్ని ప్రాంతాలు సమానమే. ఒక విధానం ప్రకారం ముందుకు వెళతామే తప్ప మరొకటి ఉండదు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బులు సమకూరుస్తున్నదే రేవంత్ రెడ్డి. ఈసారి కర్నాటక నుండి డబ్బులు వెళ్లడం లేదు. కాంగ్రెస్ ఏ ఒక్క రాష్ట్రంలోనూ గెలిచే అవకాశమే లేదు. అసోం, బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. తమిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. కేరళలనూ బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుంది. సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *