
(న్యూస్ఇన్,హైదరాబాద్)
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఆయనకే తెలియదని పురుష అహాంకారంతో మాట్లాడడం ఆయన నైజాన్ని తెలియచేస్తోందని తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే దీంట్లో కూడా మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న సెన్సెస్ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2027 సెన్సెస్ వరకు ఆగకపోవడం బీజేపీ మోస పూరిత విధానమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని హైడ్రాతో కుదేలు చేశారని, ఈ శాఖకు చైర్మన్ గా సీఎం ఉన్నా…అనధికార వైస్ చైర్మన్ గా సీఎం దగ్గర సంచులు మోసే వ్యక్తి ఆదేశాలు అమలు చేస్తున్నారన్నారు. అనుమతులు ఇచ్చేందుకు చదరపు అడుగుకు ధర నిర్ణయించి రియల్ వ్యాపారుల దగ్గర వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆక్రమ వసూళ్లపై అవసరం అనుకుంటే ఇడికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. హెఎండీఏ పరిధిలో ప్రజాధనాన్ని సీఎం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. నామినేటెడ్ పద్ధతిలో టెండర్లు అప్పచెప్పడం వెనుక భారీ కుంభకోణం జరుగుతోందన్నారు. ఈ పద్ధతికి వెంటనే స్వస్థి చెప్పాలని డిమాండ్ చేశారు. హెచ్ ఎం డీఏ పరిధిలో అక్రమాలకు సీఎం బాద్యత వహించాలన్నారు.








Leave a Reply