(న్యూస్ఇన్, హైదరాబాద్)
హైదరాబాద్ మహానగరంలో మత్తు పదార్థాల కట్టడికి పోలీసులు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటీవల టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల అరెస్టు తరువాత మత్తు పదార్థాలపై మరింత ఫోకస్ పెట్టారు. మత్తులో చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఉన్నత వర్గాలు ఖరీదైన డ్రగ్స్ కు బానిసలవుతుండగా…… పేద, మధ్య తరగతికి చెందిన యువత సహా పలువురు విద్యార్థులు అందుబాటు ధరల్లో దొరికే గంజాయి మత్తులో తూగుతున్నారు. నగరంలో గంజాయి విక్రయాలు రోజు రోజుకు పెరుగుతుండడంతో పోలీసు శాఖ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.


గంజాయిని నిరోధించే చర్యల్లో భాగంగా రౌడీ షీటర్లపై పోలీసు శాఖ దృష్టి పెట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రౌడీషీట్లు నమోదైన వారందరిని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించింది. హెచ్ న్యూ సహయంలో గంటల వ్యవదిలోనే నగరంలోని 250 మందికిపైగా రౌడీ షీటర్లకు పరీక్షులు చేసింది. పోలీసులు అనుమానించినట్లే రౌడీసీటర్లలో దాదాపు 200 మంది రౌడీషీటర్లు గంజాయి మత్తులో తూగుతున్నారని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రౌడీషీటర్లకు పరీక్షల్లో పాజిటివ్ రావడంతో….ఆయా పోలీస్ స్టేషన్లకు పోలీసులు వారిని అప్పగించారు. డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన రౌడీ సీటర్లపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మరోసారి కేసు నమోదు చేశారు. వీరిని విచారించి గంజాయి సరఫరా చేసే చైన్ పై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.పాజిటివ్ గా నమోదైన గంజాయి రౌడీషీటర్లను నాంపల్లి కోర్టులో హాజరు పరిచి డీ అడిక్షన్ సెంటర్ కు పోలీసులు తరలించనున్నారు.







Leave a Reply