(న్యూస్ఇన్, హైదరాబాద్)
నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానినికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ ను కలుసుకున్నారు. రాజకీయంగా దాదాపు సమాన అనుభవం ఉన్ననేతలు కలుసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి గత నెలలో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. బీఆర్ ఎస్ ఆహ్వానం మేరకే కారెక్కేందుకు సిద్ధం అయ్యారు. అందులోభాగంగా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన సందర్భంలో జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు..అన్నా. చాలా గ్యాప్ తర్వాత మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’’ అంటూ తన మనసులోని అభిప్రాయాన్ని జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. మాజీ మంత్రితో పాటు పలువురు కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు కేసిఆర్ ను కలుసుకున్నారు. ఈ ఇద్దరు నేతలు కొద్ది సేపు ఇష్టాగోష్టిగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత జీవన్ రెడ్డి బృందానికి లంచ్ ఆతిథ్యాన్ని కేసిఆర్ ఇచ్చారు. అయితే ఇక జీవన్ రెడ్డి కారెక్కడం లాంఛనమే ఈ నెలాఖరులోపే మాజీ మంత్రి గులాబీ గూటికి చేరుకునేలా బీఆర్ ఎస్ కార్యాచరణ అమలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఓ కీలక నేతల ఆ పార్డీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీలో చేరేందుకు ముందు వస్తుంండంతో గులాబీ నేతల్లో కొత్ జోష్ వస్తోంది.

రాజకీయంగా దాదాపు కేసీఆర్ అనుభవం ఎంతో జీవన్ రెడ్డి అనుభవం కూడా అంతే. తెలుగుదేశం పార్టీ నుంచే ప్రజా ప్రతినిధులుగా ఇద్దరు నేతలు తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ లో చేరారు. 1985లో కేసీఆర్ తొలిసారి సిద్దిపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు సార్లు జగిత్యాల నుంచి మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణా ఉద్యమ సంయంలో కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ పై పోటీ చేసి తెలంగాణా వ్యతిరేకి అనే విమర్శలను ఆయన గతంలో ఎదుర్కొన్నారు.
బీఆర్ ఎస్ లో చేరడం ఇక లాంఛనమే…..

రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్గ అనుభవం ఉన్న నేతల భేటీ రాజకీయాల్లో హాట్ హాట్ మారింది. ఈ పరిణామాలు తెలంగాణా రాజకీయాలను రాబోయే రోజుల్లో ప్రభావింతం చేసే అవకాశం ఉంటుందని గులాబీ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.








Leave a Reply