(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అన్యాయాల ఫలితంగా మల్లో 50 సంవత్సరాల దాకా తిరిగి అధికారంలోకి రాదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏఐ చిత్రాలతో గ్రాఫిక్స్ తో ఫ్యూచర్ సిటీ అని కొత్త కుట్రకి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ పూర్తిగా తన కుటుంబ సభ్యులకు తన అనుచరుల భూ కుంభకోణాల కోసమే అని కేటీఆర్ ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు అనుచరుల కోసం పేదవాళ్ల భూములను అరాచకంగా గుంజుకుంటున్న అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత కనీసం పలకరించే నాధుడు కూడా ఉండడని, కానీ ఇదే రేవంత్ రెడ్డి తన అధికారాన్ని, పదవిని చూసుకొని అహంకారంతో ప్రవర్తిస్తున్నారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు.

మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు రెండు నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం మరియు ఖ్యాతనపల్లి మున్సిపాలిటీల్లో భారత రాష్ట్ర సమితి గులాబీ జెండా ఎగిరిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు భారత రాష్ట్ర సమితి వాళ్లు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చైర్మన్ పదవులను తీసుకునేందుకు అనేక దురాగతాలకు పాల్పడిందని చివరికి న్యాయం గెలిచిందని కేటీఆర్ అన్నారు.
ఈరోజు ఇబ్రహీంపట్నంలో బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్పర్సన్, కౌన్సిలర్లను, సర్పంచ్లను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను ఎదుర్కొని బలంగా నిలబడిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు, పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా కేటీఆర్ అభినందించారు. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ప్రశాంత్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందన్నారు.
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎందుకు చేరుతున్నారో తెలుసా…….

మేము అధికారంలో వస్తే ఫార్మా సిటీ భూములను అప్పగిస్తామని అని హామీ ఇచ్చారని, రెండున్నర సంవత్సరాల తర్వాత మరో 16,000 ఎకరాల అదనపు భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నారన్నారు. ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదన్నారు. కోహెడలో 178 ఎకరాల భారీ విస్తీర్ణంలో పండ్ల మార్కెట్ భూములు అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే అవినీతి గురించి, అరాచకాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. హోటళ్ల నుంచి, బార్ల నుంచి, క్రషర్ల నుంచి ప్రతి ఒక్కరి నుంచి అడ్డగోలుగా నెలకి ఇంత చొప్పున రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న అరాచకాలను కేటీఆర్ ప్రస్తావించారు.










Leave a Reply