(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ప్రధాన రాజకీయ పార్టీలకు కొత్త చిక్కులు సృష్టించాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు హాట్ హాట్ గా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో పాటు మరికొంత మంది ఈ కేసులో రెడ్ హ్యాండెండ్ గా పట్టు బట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ దాడుల్లో పట్టుబడ్డ వారిలో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కేసులో పోలీసులు దాడులకు వెళ్లిన సమయంలో సమీత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరుపడంతో కేసు తీవ్రత మరింత పెరిగింది. కేసును పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 11 మంది లో 8 మందికి బేయిల్ ఇచ్చి పంపిచగా రోహిత్ రెడ్డి,రితీష్ రెడ్డి, సమీత్ శర్మలను అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు ఈ ముగ్గురుని కస్టడీలోకి తీసుకుని కొన్ని రోజుల పాటు విచారించివిషయాలు రాబట్టారు. అయినా విచారణకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కస్టడీకి అవకాశం ఇవ్వాలని పోలీసు లు రకోరుతున్నారు. మరోవైపు జైల్లో ఉన్న ఈ ముగ్గురు బేయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావడం లేదు….
అయితే ఈ కేసు కొలిక్కి వచ్చేంత వరకు ఎంపీ పుట్టా మహేష్ ను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కుడా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన జైల్లో ఉండడంతో పార్టీకి వివరణ అందించలేకపోయారు. రాజకీయంగా నియోజకవర్గ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ పట్టుకోల్పోకుండా గులాబీ పార్టీ దిద్దుబాటు చర్యలను మొదలు పెట్టింది.

రోహిత్ రెడ్డి ఇంచార్జ్ గా కొనసాగుతుండగా ఆ స్థానాన్ని రోహిత్ రెడ్డి బాబాయ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి కి ఇంచార్జ్ బాధ్యతలను కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈ సమాచారాన్ని ఆయనకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెరవెనుక చక్రంతిప్పిన శ్రీశైల్ రెడ్డి… తెరముందుకు వచ్చారు. నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలో మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను బీఆర్ఎస్ శ్రేణులు పకడ్బందీగా జరిగేలా చూడాలని నూతన ఇంఛార్జి శ్రీశైల్ రెడ్డి పంజుగుల అన్నారు.
ఆ రోజు రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో ఏం జరిగిందంటే…..
బోగస్ ఓట్ల తొలగింపు సజావుగా జరగడానికి, ఈ ప్రక్రియలో అధికార పార్టీ అక్రమాలు అడ్డుకోవడానికి నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్కూ ఒక్కొక్క బూత్ లెవెల్ ఏజెంట్ (BLA)ను నియమించుకోవాలని టౌన్, మండల అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు శ్రీశైల్ రెడ్డి పంజుగుల సూచించారు. రెండు రోజులలో ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వివరాలను సంబంధిత ఎమ్మార్వోలకు, ఈఆర్వోగా వ్యవహరించే ఆర్డీవోకు అందజేయాలని కోరారు.









Leave a Reply