NewsInn

News in a Click

వ‌ర్షాకాలం అంతంతే…. వెద‌ర్ మెన్ అంచ‌నా

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్ర‌భుత్వ వాతావ‌ర‌ణ శాఖ కంటే ముందుగానే వెద‌ర్ మెన్ పేరుతో వాతావ‌ర‌ణంలో చోటు చేసుకుంటున్న మార్పుల‌ను ఎప్ప‌టిక్పుడు అంచ‌నా వేస్తున్న సంస్థ ఈ ఏడాది వ‌ర్షాల‌పై త‌మ అంచ‌నాను వెల్ల‌డించింది.
బలమైన ఎల్-నినో + అనుకూల ఐఓడి ఉంద‌ని తెలిపింది. సాధార‌ణ వ‌ర్ష‌పాతం క‌టే తెలంగాణాలో త‌క్కువ‌గానే వ‌ర్షపాతం న‌మోదౌతుంద‌ని వెల్ల‌డించింది.

ఈ సంవత్సరం వర్షాకాలం 2018 మాదిరిగానే ఉంటుంది, తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 2025 లో మాదిరిగా భారీ వ‌ర్షాలు ఉండే అవ‌కాశం లేవ‌ని తేల్చి చెప్పింది.2026 రుతుపవనాల కాలంలోని అన్ని నెలలు (జూన్ – సెప్టెంబర్) ఈ సంవత్సరం ఫర్వాలేదనిపించేలా వ‌ర్షాలు కుర‌స్తాయ‌ని అయితే సాధారణం కంటే తక్కువగా వ‌ర్షాలుంటాయ‌ని తెలియ‌చేసింది. గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే, ఈ సంవత్సరం రుతుపవన వర్షాలు తక్కువగా ఉండే అవ‌కాశం ఉంద‌ని వెద‌ర్ మెన్ అంచ‌నా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలు లోటు వర్షపాతంతో తీవ్రంగా ప్రభావితం అయ్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. రాబోయే వ‌ర్షా కాలంలో త‌క్కువ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నంద‌న నీటి పోదుపుపై ఇప్ప‌టి నుంచే దృష్టి పెట్టి పంట‌ల సాగుపై ఖ‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయాల‌ని సూచించారు.

22 వ‌ర‌కు వ‌డ‌గాడ్పులే…….

గ‌తంలో వెద‌ర్ మెన్ వేసిన అంచ‌నాలు దాదాపు నిజం కావ‌డంతో ఈ ఏడాది కూడా వాతావ‌ర‌ణప‌రిస్థితులు అలాగే ఉండే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *