(హైదరాబాద్,న్యూస్ఇన్)
మధుర స్వరాల ప్రపంచలో ఆ గాయనిది ప్రత్యేక ముద్ర….92 ఏళ్ల వయస్సులో 72 ఏళ్లు స్వర లహరితో సంగీత ప్రియులను ఊర్రూతలూగించింది. సీనీ ప్రపంచలో గాన కోకిలాగా గుర్తింపు పొందింది. ఆ గాన కోకిల స్వరం ఆగిపోయింది. ఆనారోగ్య కారణాలతో 92 ఏళ్ల వయస్సులో ఆమె మృతి చెందడం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మారింది. శనివారం సాయత్రం హఠాత్తుగా పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమె 12 గంటలు గడువముందే తుది శ్వాస విడిచారు. ఈ వార్త సంగీత ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఆమె సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఎన్నో మరుపురాని మధుర గీతాలను ఆమె స్వరం నుంచి సంగీత ప్రియులు విని ఆనందించారు. కానీ ఇప్పుడా స్వరం శాశ్వితంగా మూగబోయింది. ఇక ఆ స్వరం మిగిల్చిన మధుర స్మృతులే ఆమె జ్ఙాపకాలుగా మిగిలి పోతాయి. సినీ, నాటక ప్రపంచలో ఆమె పాడిన పాటు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఆశాభోస్లే మృతి సందర్భంగా ఆమె కు సంబంధించిన స్పెషల్ స్టోరీ

కుటుంబ నేపథ్యం….
ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలో జన్మించారు. ఆమె తండ్రి పండిత్ దీననాత్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. సంగీత కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆశాకు సంగీతంపై ఆసక్తి పెరిగింది. ఆమె అక్క లతా మంగేష్కర్ సంగీత రంగంలో ఎదుగుతున్న సమయంలో, ఆశా కూడా అదే రంగాన్ని ఎంచుకున్నారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో, చిన్న వయసులోనే ఆశా భోస్లే గాన రంగంలోకి ప్రవేశించారు. తొలి రోజుల్లో జీవనోపాధి కోసం పాటలు పాడటం ప్రారంభించిన ఆమె, తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఎక్కువగా ప్రజాదరణ పొందారు.
సినీ రంగంలోకి ఎంట్రీ……
చిన్న పాటలతో మొదలైన ఆశాభోస్లే ప్రయాణం, సినీ ప్రపంచలోకి అడుగు పెట్టడంతో పెద్ద అవకాశాల వైపు దారి దక్కినట్లయింది. సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్ తో చేసిన పాటలు ఆశా భోస్లే జీవితాన్ని మలుపుతిప్పాయి. నయ్యర్ స్వరపరిచిన అనేక హిట్ పాటలు ఆశాభోస్లేకు సంగీత ప్రపంచలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.దీంతో సినీ రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ ఆశా వైపు వచ్చాయి. ఆ తరువాత ఆర్డీ బర్మన్ చేసిన పాటలు ఆమె జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఆర్డీ బర్మన్, ఆశా భోస్లే పాడిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి…..“దమ్ మారో దమ్”, “పియా తూ అబ్ తో ఆజా” వంటి పాటలు సంగీత ప్రేమికుల హృదయాల్లో శాశ్వితంగా నిలిచిపోయేలా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.

వైవిధ్యభరిత శైలి….
ఆశా భోస్లే ప్రత్యేకత ఆమె గాన వైవిధ్యం. గజల్, పాప్, కబరే, శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు ఇలా అన్ని రకాల పాటలను సమాన నైపుణ్యంతో పాడగలిగిన గాయనిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఎంతో మంది గాయకులు ఉన్నా…ఈ ప్రత్యేకతే ఆమెకు ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చిపెట్టింది. 70 ఏళ్లకు పైగా సంగీత ప్రపంచలో ఉన్న ఆమె బాలివుడ్ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ ఇలా అనేక భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. విదేశీ భాషల్లో కూడా పాటలు పాడి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.ఆశా భోస్లే తెలుగులో కూడా చిర స్థాయిగా నిలిచిపోయే ఎన్నో పాటలు పాడారు. సినీ రంగంలో కూడా పలు గుర్తుండిపోయే పాటలు పాడారు.
అవార్డులు…..

ఆశా భోస్లే ప్రతిభకు అనేక అవార్డులు దక్కాయి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూ|షణ్ పురస్కారాన్ని ఇచ్చి కేంద్రం సత్కరించింది. సినీ ప్రపంచలో ఆమె ఎన్నో జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. అంతర్జాతీయ సంగీత కార్యక్రమాల్లో పాల్గొని భారతీయ సంగీతాన్ని ప్రపంచం నలమూలల గుర్తింపు దక్కేలా చేశారు.
వ్యక్తిగతంగా ఒడిదుకులే….
ఆశా భోస్లే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదటి వివాహం విఫలమైన తర్వాత, తరువాత ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ ను వివాహం చేసుకున్నారు. ఈ సంబంధం ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు సంగీత ప్రయాణానికీ కొత్త దిశనిచ్చింది. ఆశా భోస్లే ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయని అనే గుర్తింపును పొందారు. ఆమె వేల సంఖ్యలో పాటలు పాడి గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు. ఆశా భోస్లే పేరు వింటేనే సంగీతం గుర్తుకు వస్తుంది. ఆమె స్వరం తరాల తరబడి వినిపిస్తూ ఉంటుంది. భారతీయ సంగీత చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది.









Leave a Reply