(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
దేశంలోని ప్రాంతీయ క్రికెట్ పాలక మండళ్లలో హెచ్ సీ ఏ నిత్యం వివాదాలతో సతమతం అవుతోంది. హెచ్ సీ ఏలో విబేధాలు, వివాదాలు క్రీడాకారుల పాలిట శాపంగా మారుతున్నాయి. హెచ్ సీఏ అనుసరించిన విధానాలపై క్రికెట్ వర్గాల్లో ఎన్నో చిక్కువీడని ప్రశ్నలు వెంటాడుతున్నాయి. హెచ్ సీ ఏ లో మాజీ భారత జట్టు కెప్టన్ అజహారుద్దీన్ కీలక బాధ్యతలు నిర్వహించినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను గాడిన పెట్టలేకపోయారు. తాజాగా కొత్త కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. గతంలో ఉన్న కార్యవర్గంపై అవినీతి ఆరోపణలు, అక్రమాల విమర్శలు రావడం ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీరియస్ గా వ్యవహరించింది. గత పాలక మండలిలో కీలక వ్యక్తులంతా జైలు పాలై పదవులు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితం మిగిలిన సమయానికి కొత్త కార్యవర్గం ఎన్నిక కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో హెచ్ సీ ఏ ముందున్న సవాళ్లను కొత్తకార్యవర్గం ఎలా అధిగమిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న చర్చకు దారి తీస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న మన్నె జీవన్ రెడ్డి హెచ్ సీఏ లో ఇప్పుడు కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మన్నే జీవన్ రెడ్డి కొత్త ఇన్నింగ్స్ హెచ్ సీఏ లో మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించినా తొలిసారి అది కలిసి రాలేదు.కానీ భారత దేశ ప్రజలతో మేమకమై ఉన్న క్రికెట్ ప్రపంచలో మన్నే జీవన్ రెడ్డి అడుగు పెట్టారు. యువ క్రీడాకారులను వెలుగులోకి తేవడం, వారిని ప్రోత్సహించడం వంటి కీలక సవాళ్లు కొత్త కార్యవర్గం ముందున్నాయి. ఇప్పటి వరకు హెచ్ సీఏ అంటే హైదరాబాద్ కే పరిమితం అయిందన్న అపవాదును ఎదుర్కొంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన జీవన్ రెడ్డి కీలక బాద్యతలు నిర్వహించే అవకాశం దక్కడంతో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కుతుందన్న ఆశలు కలుగుతున్నాయి.
బీసీసీఐ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లి హెచ్ సీఏ పై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కొత్త కార్యవర్గంపై ఉంది. హెచ్ సీఏ పై నమ్మకం కల్పించాలంటే ఇలాంటి చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పారదర్శక పాలన …
అన్ని నిర్ణయాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి
సెలక్షన్, ఫైనాన్స్, టెండర్స్ అన్నీ ఆన్లైన్లో చూపాలి
రాజకీయాలు – గ్రూపిజం
సెలక్షన్ కమిటీని పూర్తిగా ప్రొఫెషనల్స్తో ఏర్పాటు చేయాలి
మాజీ క్రికెటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి
రికమండేషన్లు పూర్తిగా ఆపాలి
టెక్నాలజీ వినియోగం
మ్యాచ్ డేటా, స్టాటిస్టిక్స్ ఆధారంగా సెలక్షన్ చేయాలి
ప్రతి ప్లేయర్ ప్రతిభ ట్రాకింగ్ చేయాలి- అవసరమనుకుంటే లైవ్ స్ట్రీమింగ్ చేయాలి

జిల్లాల పై ఫోకస్
ప్రతి జిల్లాలో అకాడమీలు ఏర్పాటు చేయాలి
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను బయటకు తీయాలి
జిల్లా స్థాయి టోర్నమెంట్ల నిర్వహించాలి
మౌలిక సదుపాయాల కల్పన….
గ్రౌండ్స్, నెట్స్, ట్రైనింగ్ సెంటర్లను ఆధునీకరించి మౌలిక సదుపాయాలు కల్పించాలి
యువ ఆటగాళ్లకు ఫిట్ నెస్, కోచింగ్ అందేలా చర్యలు తీసుకోవాలి
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడాకారులను సిద్ధం చేయాలి
అవినీతి…..
ఖర్చులపై ఖచ్చితమైన అజమాయిషీ ఉండాలి
కీలక నిర్ణయాలకు పాలక మండలిలో ఆమోదం పొందాలి
అవినీతి జరిగితే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
దీర్ఘ కాలిక ప్లాన్ లు ఉండాలి
Under-14, 16, 19 లెవెల్స్లో ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలు నిర్వహించాలి
స్కూల్స్ & కాలేజీ లతో సమన్వయం చేసుకుని క్రికెటర్లను తీర్చి దిద్దాలి

వీటితో పాటు…. అవినీతిలో కురుకుపోయి నమ్మకం కోల్పోయిందనేది ప్రధాన ఆరోపణ….ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జూనియర్ టీం సెలక్షన్లో పే టు ప్లే ( జట్టుకు ఎంపిక చేయాలంటే సెలక్షన్ కమిటీ చేతులు తడుపాలని) ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆటగాళ్లలో హెసీఏ నమ్మకం కోల్పోయింది. ఐపీఎల్ ఫ్రాంచైజీతో సత్సంబంధాలు లేకపోవడంతో…గత ఏడాది తీవ్ర వివాదంగా మారి హెచ్ సీఏ పరువు పోయింది. ఈ కారణంగా CID, ACB వంటి సంస్థలు విచారణలు జరుపుతున్నాయి. జిల్లాలపై హెచ్ సీఏ మాత్రం దృష్టి పెట్టాలేదన్న వాదన కూడా బలంగా ఉంది. ఈ కారణంగా గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యం ఉన్నా….బయటకు రాని పరిస్థితి ఉంది. హెచ్ సీఏ చుట్టూ వివాదాలు ముసురు కోవడంతో దేశీయ క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సత్తా చాటక ఎన్నో ఏళ్లు గడిచి పోయింది. వివాదాల మధ్య నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలున్నాయి.ఇలాంటి అంశాలపై హెచ్ సీ ఏ దృష్టి సారిస్తే తప్ప రాబోయే రోజుల్లో పూర్వవైభవాన్ని సాధించే అవకాశం లేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.








Leave a Reply