(హైదరాబాద్,న్యూస్ ఇన్)
పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకమైన ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సర్పంచ్ పదవి కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఒక్క ఓటుతో విజయం సాధిస్తే ఆ చిల్లే వేరబ్బా… అన్నట్లు ఉంటుంది. రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో న్యూస్ ఇన్ దృష్టికి వచ్చాయి. మొదటి దశలో కూడా ఒక ఓటుతో గెలుచుకున్న సర్పంచులు,వార్డు అభ్యర్థులు ఉన్నారు.

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద ఉత్కంఠభరిత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా కోడలు రంగంలో ఉండడంతో పోలింగ్ కు నాలుగు రోజులు ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి వచ్చి వేసిన ఓటు తనను గెలిపించిందని శ్రీ వేద అంటున్నారుఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 పోలవ్వగా.. శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188, ఒక్క ఓటు చెల్లలేదు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో రమాదేవి అనే సర్పంచ్ అభ్యర్థి కూడా ఒకే ఒక ఓటు తేడాతో విజయం సాధించారు



Leave a Reply