NewsInn

News in a Click

మున్సిపల్ ఎన్నికల్లో 73.01శాతం పోలింగ్

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. చిన్నచిన్న ఘటనలు మినహా పెద్దగా అవంతరాలు ఎక్కడ ఏర్పడలేదు. ఎన్నికల్లోరాష్ట్ర వ్యాప్తంగా 73.01 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.మున్సిపాలిటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో అత్యధికంగా 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నల్గొండ జిల్లా నడికొండ మున్సిపాలిటిలో 59.68శాతం మాత్రమే నమోదు అయింది.మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా నల్గొండ కార్పొరేషన్ లో 77.36 శాతం అత్యల్పంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 59.12 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క మధిరలో ఓటు వేశారు. పలువురు,మంత్రులు ఎమ్మెల్యేలు, నేతలు ఆయా మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రంలో ఎక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు సర్వే వివరాలు బయటపెట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *