(అమరావతి,న్యూస్ఇన్)
తమిళ నాడులో మళ్లీ జయలలిత పాలన రావాలంటే ఎన్డీఏ అభ్యర్థులనే గెలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీఎంకే వ్యతిరేకంగా ఓటేసి మహిళలకు తీరని అన్యాయం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి మహిళలకు… డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్, డీఎంకే సహా ఇండి కూటమి పార్టీలు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించాయని ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన బిల్లులను అడ్డుకోవడం ద్వారా ఇండి కూటమి పార్టీలు చేసిన తప్పిదాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు.

కోయంబత్తూర్ నగరంలోని వివిధ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కోయంబత్తూరులోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్ధులు హాజర్యయారు. తమిళనాడుతో ఏపీకి… ఎన్టీఆర్కు, తనకు ఉన్న అనుబంధాన్ని సమావేశంలో వివరించారు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీరిచ్చామని… నదుల అనుసంధానం జరిగితే… గోదావరి నీళ్లను తమిళనాడుకు ఇవ్వవొచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని… ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి జరుగుతోందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని డీఎంకే సహా ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలు తప్పు చేశాయన్నారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేదని చెప్పారు. డీఎంకే సహా ఇండి కూటమి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ వివిధ అంశాలపై స్పందించారు.
తమిళంలో బాబు వ్యాఖ్యలు…..

కోయంబత్తూరులో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో మధ్య మధ్యలో తమిళ పదాలను ఉపయోగించారు. తమిళంలో కొన్ని పదాలు వాడారు. అనైవరుక్కుం వణక్కం… ఎన్ అన్బాన తమిళ్ నాడు మక్కళే, ఉంగళుడన్ ఎన్ పిరందనాళ్లిల్ ఇంగే ఇరుప్పదు రొంబవే సంతోషం.(అందరికీ నమస్కారం… నా ప్రియమైన తమిళనాడు ప్రజలారా, నా పుట్టినరోజు రోజున మీతో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది.) అంటూ తన పుట్టిన రోజున తమిళనాడుకు రావడం సంతోషంగా ఉందంటూ తమిళంలో భాషలో చెప్పారు. అలాగే మున్నేట్రం వేణ్డుమా… వేలైవాయుప్ప గళ్ వేణ్డుమా… అప్పడియానాల్ మధ్యతిల్ మోదీజీ ఇరుక్క వేణ్డుం… మానిలతిల్ అమ్మ ఆట్చి వర వేణ్డుం. ఇదుక్కు NDA కూట్టణియై వెట్రి పెర చేయ్యుంగల్..(మీకు అభివృద్ధి కావాలా… ఉద్యోగ అవకాశాలు కావాలా? అలా అయితే కేంద్రంలో మోదీజీ ఉండాలి. రాష్ట్రంలో అమ్మ జయలలిత పాలన రావాలి. అందుకోసం NDA కూటమికి విజయం చేకూర్చండి.) అంటూ జయలలితను గుర్తు చేస్తూ తమిళ భాషలో ప్రసంగించారు.
.









Leave a Reply