ముఖ్యమంత్రులను ఆహ్వనించేందుకు మంత్రులు
గ్లోబల్ సమ్మెకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
( హైదరాబాద్, న్యూస్ఇన్)
ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విపక్ష నేత రాహూల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయిక ప్రియాంక గాంధీలను ఆహ్వానించార. సీఎంతో భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత శ్రీ మల్లికార్జున ఖర్గే ను కలిశారు. డిసెంబర్ 8–9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025″కు హాజరు కావాలని ఆహ్వానించారు.

డిసెంబర్ 8 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎం లను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. స్వయంగా మన రాష్ట్ర మంత్రులు వెళ్లి వారిని ప్రత్యేకంగా కలిసి ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు. ఎవరెవరు ఏ ఏ రాష్ట్రాలకు వెళ్లాలో సీఎం నిర్ణయించారు.
ఈ నెల 4 వ తేదీన మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన లేఖలు అందిస్తారు

జార్ఖండ్ -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జమ్మూ కాశ్మీర్ -గుజరాత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
పంజాబ్ హర్యానా- దామోదర్ రాజనర్సింహ
ఆంధ్రప్రదేశ్-కేరళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కర్ణాటక -తమిళనాడు- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఉత్తర ప్రదేశ్ -పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాజస్థాన్ పొన్నం- ప్రభాకర్
చత్తీస్ గడ్ -కొండ సురేఖ
వెస్ట్ బెంగాల్- సీతక్క
మధ్యప్రదేశ్ -తుమ్మల నాగేశ్వరరావు
అస్సాం -జూపల్లి కృష్ణా రావు
బీహార్ -వివేక్ వెంకటస్వామి
ఒడిస్సా -వాకిటి శ్రీహరి
హిమాచల్ ప్రదేశ్- అడ్లూరు లక్ష్మణ్ కుమార్
మహారాష్ట్ర – మొహమ్మద్ అజారుద్దీన్ఢి ల్లీ సీఎం, కేంద్ర మంత్రులను ఎంపీ లు ఆహ్వానం అందిస్తారు.




Leave a Reply