
- పని చేయని ధనబలం, మేయర్ పదవి ప్రచారం
(నిజామాబాద్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్సించిన నిజామాబాద్ కార్పోరేషన్ పరిధిలోని ఒక డివిజన్ ఆకర్షించింది. ఈ డివిజన్ నుంచి పోటీ చేసేందుకు 8 కోట్ల రుపాయాల పెండింగ్ టాక్స్ లను రాత్రికి రాత్రి చెల్లించి అందరిదృష్టి తన వైపుకు తిప్పుకున్న కాంగ్రెస్ నేతకు ఊహించని పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ స్థానం కూడా పార్టీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన ఆ నేతకు ఫలితం ఖంగు తినేలా చేసింది. నిజామాబాద్ కార్పోరేషన్ పరిధిలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంఓ ఈ కాంగ్రెస్ నేతకు ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. తాను పోటీ డివిజన్ డివిజన్ ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి ఆ నేత ఇంకా తేలుకోలేదు.

వివరాలను ఒక సారి పరిశీలిస్తే నిజామాబాద్ పట్టణంలో ప్రముఖ హోటల్ నిర్వహిస్తున్న నేత దాదాపు 20 ఏళ్లుగా తన రాజకీయ పరపతితో టాక్స్ చెల్లించకుండా వస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా అవకాశం దక్కడంతో…రాత్రి రాత్రి పెండింగ్ టాక్స్ బకాయిని మొత్తం కట్టారు. 8 కోట్ల రుపాయలకు పైగా బకాయి కట్టడంతో రాష్ట్రం దృష్టిని ఈ నేత ఆకర్షించారు. తన సతీమణి అయిన కాటేపల్లి శమంత నామినేషన్ కు ముందు బకాయి పన్ను చెల్లించారు. దీంతో ఈ డివిజన్ లో ఒక్క సారిగా భారీ అంచనాలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి అని ప్రచారం చేసుకోవడంతో ఎలాగైనా విజయం దక్కించుకోవాలని ఎన్నికల్లో కూడా భారీగా వెచ్చించారు. మేయర్ అభ్యర్థి కావడంతో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థలకు తన వంతు సహాయాన్ని ఆ కాంగ్రెస్ నేత చేశారు.

కేవలం ధన బలంతోనే రంగంలోకి దిగిన ఆ నేతకు నిరాషే మిగలింది. ఆ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కాటేపల్లి శమంత పోటీ చేసిన ఈ డివిజన్లో ఓటర్లు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు.భారీ వ్యయం చేసినా దక్కని గెలుపు, రాజకీయాల్లో ధన ప్రభావం కంటే ప్రజాభిప్రాయమే బలమైనదని మరోసారి నిరూపించినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.




Leave a Reply