
హ్యరీ బ్రూక్ సెంచరీ
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచకప్ కప్ లో సూపర్ 8 దశలో మ్యాచ్ లు ఏకపక్షంగా సాగుతున్నాయి. దక్షిణాఫ్రికా, వెస్ట్ఇండీస్, ఇంగ్లాండ్ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై సులువుగా విజయం సాధించాయి. భారత్ పై భారీ తేడాతో సౌత్ ఆఫ్రీకా విజయం సాధించగా జింబాబ్వేను వెస్ట్ ఇండీస్ చిత్తు చేసింది. ఇంగ్లాండ్ పాకిస్తాన్ ను మట్టి కరిపించింది.
సూపర్ 8 లో భాగంగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ పై విజయం దక్కించుకుంది. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే పూర్తి చేసింది.ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ హరీ బ్రూక్ పాక్ బౌలర్లపై వీరవిహారం చేశారు. 51 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్స్ లతో వంద పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ ను కోల్పోయింది. 3వ ఓవర్లో జోస్ బట్లర్ కూడా వెనుదిరిగారు అప్పటికీ ఇంగ్లాండ్ స్కోరు 17 పరుగులు మాత్రమే.మరో 18 పరుగులుజోడించిన అనంతరం జాకబ్ బేథిలీ కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ 35 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 58పరుగులవద్ద 8 వ ఓవర్లో టాం బర్టన్ కూడా పెవీలియన్ చేరడంతో పాకిస్తాన్ కు గెలుపుపై ఆశలు చిగురించాయి. 12 ఓవర్లలో వందకుపైగా పరుగులు చేయాల్సిఉండడంతో పాక్ ను విజయం ఊరించింది.కానీ అక్కడే ఇంగ్లాండ్ జట్టు బాటర్లు పాకిస్తాన్ బౌలర్లపై వీర విహారం మొదలు పెట్టారు. హ్యరీ బ్రూక్, సంకరన్ లు స్కోరు పెంచే బాద్యతను తీసుకున్నారు.

ఐదో వికెట్ భాగస్వామ్యం కోసం 12వ ఓవర్ వరకు 12 ఓవర్లలో 103 పరుగులకు స్కోరు చేరిన తరువాత కరన్ రూపంలో ఇంగ్లాండ్ 5వ వికెట్ కోల్పోయింది. మరో వైపు హ్యరీ బ్రూక్ పాక్ బౌలర్లపై తన ఆధిపత్యం కొనసాగిస్తూ సెంచరీ నమోదుచేసుకుని ఇంగ్లాండ్ విజయాన్ని ఖరారు చేసి 155 పరుగల వద్ద 6వ వికెట్ రూపంలో ఔటయ్యారు. ఆ తరువాత విల్ జాక్స్, ఓవర్టన్ కూడా వెంటనే ఔటయ్యారు.కానీ అప్పటికీ ఇంగ్లాండ్ విజయంకోసం కేవలం 5పరుగుల దూరంలో మాత్రమే ఉంది. దీంతో 19.1 ఓవర్లలో ఇంగ్లాండ్ తన లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి 166పరుగులు చేసి పాక్ పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ 4 వికెట్లు తీసుకున్నారు.
అంతకు ముందు పాక్ 20 ఓవర్లలో 164పరుగుల స్కోరు చేసింది. పాక్ జట్టు ఓపెనర్ షెహబ్జాదా ఫర్హాన్ 45 బంతలు ఎదుర్కొని 7 ఫోర్లు ,2 సిక్స్ ల సహాయంతో 63 పరుగులుచేశారు. మిగిలినపాక్ బ్యాట్స్ మెన్లు అంతా కలిపి మరో వంద పరుగుల చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డాసన్ 3,ఓవర్టన్ 2, ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టారు.
రెండో మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా సునాయస విజయం దక్కించుకుంది.




Leave a Reply