రెవెన్యూలో సమూల మార్పులు చేశాం
ఒకే గొడుగు కిందకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
(హైదరాబాద్, న్యూస్ఇన్)
గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటిఆర్ ముడుపులు తీసుకుని ల్యాండ్ కన్వర్షన్ చేశారని, తాము క్యాబినెట్ తీర్మానం చేసి పారదర్శకంగా వ్యవహరిస్తే….తమపై ఆరోపణలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వారికి అవసరమైన ప్రాంతాలను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్చారు. మేం అలా చేయలేదు. పారదర్శకంగా క్యాబినెట్ తీర్మానం చేశాం. ఆనాడు కన్వర్షన్ చేసిన ల్యాండ్ వివరాల చిట్టాను త్వరలోనే బయటపెడుతామన్నారు.

అదేవిధంగా గత ప్రభుత్వ హయాం నుంచి చోటుచేసుకున్న అక్రమాలను వెలికితీసేందుకు గాను ఇంతవరకు రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని, వాటి ఫలితాలను గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు.హిల్ట్ పాలసీపై స్పందిస్తూ నోరుందని ఏదిపడితే అది మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.రాష్ట్రంలో రెండేళ్లలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజల సౌలభ్యం కోసం విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేవంలో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్ను అందుబాలులోకి తీసుకువస్తామని ,ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన యాప్ను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులలో అర్హత కలిగిన వాటిని జనవరి నెలాఖరు కల్లా పరిష్కరిస్తామని, ఆ తర్వాత ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.







Leave a Reply