NewsInn

News in a Click

సీఎం రేవంత్ పై క‌విత ఫిర్యాదు

ఎన్నిక‌ల సంఘం స్పందిచాలి

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

ప్రభుత్వ ధనంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని కి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించార‌ని, పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఏం అధికార దుర్వినియోగానికి పాల్పుడ‌తున్నార‌ని క‌విత విమ‌ర్శించారు.అర్బన్ ఏరియాల్లో ప్రజాధనంతో మీటింగ్ పెట్టి సర్పంచ్ ఎన్నికల్లో సీఎం గారు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సీఎం ప‌ర్య‌ట‌న‌ల మీద ఆంక్షలు పెట్టాలి. లేదంటే నిలిపివేయాలని మొదటి రోజే మేము డిమాండ్ చేశామన్నారు.గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం ఎలక్షన్ కోడ్ ఉండేది. రాష్ట్రంలో ఫెయిర్ అండ్ ఫ్రీ గా ఎన్నికలు జరగాలంటే వెంటనే సీఎం టూర్ ని నిలిపివేయాలి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతామ‌ని క‌విత వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే సరే. కానీ ప్రజాధనంతో ఇలా చేయటం సరికాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *