స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ కుమార్
బీఆర్ఎస్ పిటిషన్ లపై తీర్పు వెల్లడి
(హైదరాబాద్, న్యూస్ఇన్)
పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్… భారీ ఊరటను ఇచ్చారు. తమ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరారని గులాబీ పార్టీ వారిపై అనర్హత రేటు వేయాలని వేటువేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ పిటీషన్లు వేసింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు సూచనలతో నిర్ణయం తీసుకునేందుకు అనుగుణంగా గత కొన్ని నెలలుగా విచారణ ముమ్మరం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించడంతో…. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ఈరోజు వెల్లడించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనేందుకు ఆధారాలు లేవని ప్రకటించారు.

బుధవారం ఎమ్మెల్యేల ఫిరాయింపు పై నిర్ణయం వెల్లడించిన స్పీకర్ అయిదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. అనర్హతకు తగిన ఆధారాలు లేని కారణంగా ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితి పార్టీలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు.
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ లపై స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యల పై విచారణ కొనసాగుతుంది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల పై కూడా స్పీకర్ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.







Leave a Reply