బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు
(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈరోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు.పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు.రాజ్యాంగాన్ని కాపాడుతామని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్ను కూడా ప్రభావితం చేసి, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకుండా చేసిందన్నారు.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అలాంటి పార్టీనే ఈరోజు ఆ చట్టానికీ, రాజ్యాంగానికీ గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిందని ఆరోపించారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న నాయకులే, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన స్పీకర్పై ప్రభావం చూపి ఈ తరహా నిర్ణయం తీసుకునేలా చేశారని విమర్శించారు.స్పీకర్ పదవి స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పదవి. ఈరోజు తీసుకున్న స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ హత్య… ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు.






Leave a Reply