12మంది నక్సల్స్, ఇద్దరు పోలీసుల మృతి
(హైదరాబాద్, న్యూస్ఇన్)
బీజాపూర్-దంతేవాడ అంతర్ జిల్లా సరిహద్దు లోని బస్తర్ డివిజన్ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం నక్సల్స్ కోసం కూంబింగ్ ఆపరేషన్ పోలీసులు కొనసాగించారు. ఈ సమయంలో నక్సల్స్, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. సాయంత్రం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.ఇదే సమయంలో ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోడిగా గుర్తించారు. అలాగే, మరో ఇద్దరు బీజాపూర్ డి ఆర్ జి సిబ్బంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
సంఘటన స్థలములో పోలీసులు SLR రైఫిల్స్, 303 రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






Leave a Reply