పట్టణమంతా కలియ తిరిగిన మంత్రి
అభివృద్ధి పనుల పరిశీలన
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు.పట్టణంలోని అన్ని పాంతాల్లో పర్యటించారు. స్థానికులతో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే సంబంధిత అదికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు కి ఇరువైపుల ప్లాంటేషన్ చేయాలని ..మున్సిపాలిటీ లో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అక్కడ అలంకరణ మొక్కలు ,ఇతర మొక్కలు నాటాలని సూచించారు..7 వ వార్డు లో కొనసాగుతున్న కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించారు..పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు..
ఆర్మీ లో సేవలు అందిస్తున్న అంగోజు ప్రశాంత్ తో మాట్లాడుతూ పట్టణంలో ఆర్మీ లోకి వెళ్లాలనుకునే వారికి అవగాహన సదస్సు నిర్వహించాలని ఆసక్తి ఉన్నవారు ఆర్మీ లో చేరేలా వారికి గైడ్ చేయాలని సూచించారు..

జనవరి లోపు స్వర్ణకారులు కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అంబేద్కర్ జంక్షన్ ,మల్లె చెట్టు చౌరస్తా లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు పరిశీలించాలని సూచించారు..
నిర్మాణంలో ఉన్న రెడ్డి,మున్నూరు కాపు, యాదవ, గౌడ ,పద్మశాలి కమ్యూనిటీ హాల్ లను పరిశీలించారు…భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు..అనంతరం మీడియా తో
మంత్రి మాట్లాడుతూ…నియోజకవర్గ కేంద్రం హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల 33 cm భారీ వర్షంతో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలు,ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి , డ్రైనేజీ నిర్మాణాల ,ఓపెన్ జిమ్ , చిల్డ్రన్ పార్క్స్ నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు.
శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ,పక్కన అర్బన్ ఫారెస్ట్ పార్క్ ,నాలుగు జిల్లాల మధ్యలో ఉన్నందున నలువైపుల నాలుగు లైన్ ల రోడ్డు ,టూరిజం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
అర్హులైన వారికి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం.. ఎక్కడ పైరవీలకు తావు లేకుండా ఎంపిక జరుగుతుంది..ఇళ్లు లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.రేషన్ కార్డులు రాని వారు అప్లై చేసుకోవాలి రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని మంత్రి చెప్పారు.







Leave a Reply