NewsInn

News in a Click

కృష్ణా, గోదావ‌రి జలాల‌పై చ‌ర్చ‌కు సిద్ధం

కృష్ణా, గోదావ‌రి జలాల‌పై చ‌ర్చ‌కు సిద్ధం

బీఆర్ఎస్, బీజెపి క‌లిసినా అత్య‌ధిక స్థానాలు మావే

కేటిఆర్ ఫేయిల్యూర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల్లో 66 శాతం విజ‌యం సాధించామ‌ని, బీఆర్ఎస్, బీజెపి కూట‌మిగా కేవ‌లం 33 శాతం గెలుచుకున్నాయ‌ని ఒక శాతం క‌మ్యూనిస్టులు ఓట్లు సాధించార‌ని సీఏం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంచాయ‌తీ ఎన్నిక‌లు పూర్తి చేసినందుకు అధికారుల‌ను అభినందించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటైన రెండేళ్ల త‌రువాత జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ‌కు సంపూర్ణంగా మ‌ద్ద‌తు తెలిపార‌న్నారు. రెండేళ్ల ప్ర‌జా పాల‌న‌పై ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు ఇద‌ని సీఎం వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో , బీజెపి ఒక నియోజ‌క వ‌ర్గంలో మాత్ర‌మే అత్య‌ధిక స్థానాలు గెలుచుకున్నాయ‌ని సీఎం చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన అభివృధ్ధి,సంక్షేమ ప‌థ‌కాల కార‌ణంగా త‌మ పార్టీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని సీఎం వ్యాఖ్య‌లు చేశారు. 2029 ఎన్నిక‌ల్లో కూడా పంచాయ‌తీ ఫ‌లితాలే పున‌రావృత్తం అవుతాయ‌ని సీఎం ధీమా వ్య‌క్తం చేశారు.

బీఆర్ ఎస్ పార్టీ పై ఘాటు వ్యాఖ్య‌లు…

ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కొందరికి ఇంకా అహంకారం తగ్గలేదని బీఆర్ ఎస్ నేత‌ల‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఒకాయన కడుపులో మూసీలో కాలుష్యం కంటే ఎక్కువ విషం కనిపిస్తోందన్నారు.కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే ఆయన్ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చామ‌న్నారు.ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు… ప్రతిపక్ష నాయకుడిగా కేసిఆర్ లేఖరాస్తే… కృష్ణా జలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం….ఎప్పుడుకావాలంటే అప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్లలో తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేటిఆర్ ఫేయిల్యూర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్….

కేటిఆర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత ఏ ఎన్నిక‌ల్లోనూ పార్టీ విజ‌యం సాధించ‌లేద‌న్నారు. కేటిఆర్ ను త‌ప్పించేలా హ‌రీష్ వ‌ర్గం సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం మొద‌లు పెట్టింద‌ని సీఎం వ్యాఖ్యానించారు. ఈ విష‌యం ఎక్కువ‌గా చ‌ర్చ‌కు రాకుండానే కేటిఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న మొద‌లు పెట్టార‌ని చెప్పారు. మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ అంశాన్ని సీఎం లైట్ గా తీసుకున్నారు. ప్రైవేటు కార్య‌క్ర‌మానికి తాను హాజ‌ర‌య్యాన‌ని చెబుతూనే….త‌న మ‌నువ‌డిని ఫూట్ బాల్ ప్లేయ‌ర్ ను చేయాల‌న్న ఉద్దేశ్యంతోనే తాను గ్రౌండ్ కు తీసుకెళ్లాన‌ని, కేసీఆర్ పిల్లాల్లా తాను క్ల‌బ్ లు, ప‌బ్ ల‌కు తీసుకెళ్ల లేద‌న్నారు. ఈ కార్ రేస్ విచార‌ణ‌లో భాగంగా అర‌వింద్ కుమార్ ను విచారించేందుకు అనుమ‌తి కోరామ‌ని అనుమ‌తి రాగానే విచార‌ణ కొన‌సాగుతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *