సంగారెడ్డి మెడికల్ కాలేజీలో కలకలం
(హైదరాబాద్, న్యూస్ ఇన్ )

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో వరుస ర్యాగింగ్ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది.
ఫస్ట్ ఇయర్ మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు.ఎందుకు ర్యాగింగ్ చేశారంటూ సీనియర్ విద్యార్థులను నిలదీసిన బాధిత విద్యార్థి సోదరుడు.మమ్మల్నే నిలదీస్తవా అంటూ శాంతినగర్ లోని బాధితుడి ఇంటి మీదకి వెళ్ళి, అతడి తండ్రిపై దాడికి దిగిన యాభై మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు. స్థానికులు మేడికోలను అడ్డుకొని ఇద్దరు విద్యార్థులను బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు


Leave a Reply