NewsInn

News in a Click

పార్లమెంటుకు చేరిన కోతుల సమస్య

(హైదరాబాద్,న్యూస్ఇన్)

తెలంగాణలోని మన ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రమైంది. వాటి సంఖ్య గణనీయంగా పెరగడంతో పంటలు కూడా రైతుల చేతికి సక్రమంగా అందడం లేదు. చేతికొచ్చిన పంటలను రైతులు కోతుల కారణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ సమస్యపై చవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి లోకసభ లో ప్రస్తావించారు. కోతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దగ్గర ఇలాంటి ప్రణాళిక లేదన్నారు. అటవీ, వ్యవసాయ శాఖలు తమ పరిధిలోని అంశం ఇది కాదంటూ స్పష్టమైన సమాచారం ఇస్తున్నారని, ప్రభుత్వ పరంగా కోతుల సమస్యల నుంచి కాపాడేందుకు ఓ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోతుల సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలి కోతుల సమస్య తమ శాఖ కిందికి రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయి. కోతుల సమస్య ఏ శాఖ కిందికి వస్తుందో వెల్లడించాలి. కోతుల సమస్య చిన్నగా అనిపిస్తుంది, కానీ పెద్ద సమస్య.తెలంగాణ మాత్రమే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్య ఉంది.సర్పంచి ఎన్నికల్లో కూడా కోతుల సమస్య ఒక ఎజెండా మారింది..కోతుల సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తాం అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *