NewsInn

News in a Click

గ్రేట‌ర్ లో ల‌ష్క‌ర్‌ కార్పోరేష‌న్ ఉద్య‌మం

ల‌ష్క‌ర్ కార్పోరేష‌న్ ఏర్పాటు చేయాలి

మాజీ మంత్రి త‌ల‌సాని మ‌ద్ద‌తు

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ కార్పోరేషన్ గా ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్ లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో లష్కర్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని చేపట్టిన దీక్షలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు మున్సిపాలిటీ లుగా ఉండేవని, కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, నగరం విస్తరించడంతో 100 డివిజన్ లతో గ్రేటర్ హైదరాబాద్ గా ఏర్పడిందని తెలిపారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో 150 డివిజన్ లుగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ORR లోపల ఉన్న మున్సిపల్ కార్పోరేషన్ లు, మున్సిపాలిటీ లను విలీనం చేసి 300 డివిజన్ లు చేసిందని చెప్పారు. మూడు కార్పోరేషన్ లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నందున లష్కర్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్న ఈ ప్రాంత ప్రజల డిమాండ్ న్యాయమైనదని, ఆ కోరిక ను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ప్రాంతం కు గతంలో లష్కర్ అనే పేరు ఉండేదని, 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఘనంగా సంబురాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ల‌ష్క‌ర్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

డివిజ‌న్ల ఏర్పాటులో శాస్త్రీయ‌త లేదు…

డివిజన్ ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని, ఆఫీసుల్లో కూర్చొని డివిజన్ లను ఏర్పాటు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. మేయర్ కే తెలవకుండా డివిజన్ లను ఏర్పాటు చేయడం బాధాకరం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *