NewsInn

News in a Click

పోలీసుల పిలుపు….హార్ట్ అటాక్ తో వ్య‌క్తి మృతి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ప‌ద్మావ‌తి కాల‌నీకి చెందిన ఓ ఆపార్ట్ మెంట్ లో గ‌త కొన్ని రోజులుగా ఇటీవ‌ల కొత్త‌గా వ‌చ్చిన కుటుంబంతో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. కొత్త‌గా చేరిన కుటుంబ స‌భ్యులు అసాంఘీక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న్న అనుమానంతో ప‌క్కింటి వారు నిల‌దీశారు. కొత్త‌గా చేరిన కుటుంబాన్ని ఆపార్ట్ మెంట్ ఖాళీ చేయాల‌ని ఆ ఆపార్ట్ మెంట్ లోని ఇత‌ర ఫ్లాట్ ఓన‌ర్లు, మ‌రికొంత మంది ఆ కుటుంబానికి విష్ణుప్రియ అనే మ‌హిళ‌కు చెబుతూ వ‌చ్చారు.

దీన్ని జీర్ణించుకోలేని ఓ మ‌హిళ త‌న‌ను నిల‌దీసిన వారిపై ఉప్ప‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు బ్లాక్ మ్యాజిక్ చేస్తోందంటూ అపార్ట్‌మెంట్ లో పొరుగింటివారితో గొడవలు జరుగుతుండడంతో ఇంటిని ఖాళీ చెయ్యమని ఫ్లాట్ అద్దెకు ఇచ్చిన ఓనర్ కూడా చెప్పారు..తనపై , తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ రాకేష్ రెడ్డి పై ఈనెల ఆరున ఉప్పల్ పీఎస్ లో విష్ణుప్రియ ఫిర్యాదు చేసింది.విచారణ కోసం ఉప్పల్ పోలీసులు పిలవడంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన రాకేష్ రెడ్డి హర్ట్ అటాక్ తో మృతి చెందాడు.దీంతో మృతుడి బంధువులు , స్థానికులు విష్ణుప్రియ ఇంటి వద్ద ఆందోళన చేయడంతో ఉప్పల్ పోలీసులు రంగంలోకి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *