సోదాలు భారీగా ఆస్తుల గుర్తింపు
మై హోం భుజాలో ఒక ఫ్లాట్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే ఎడి శ్రీనివాసులు అక్రమ ఆస్తులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. పెద్ద ఎత్తున అక్రమాలకు పడుతున్నాడని ఫిర్యాదులు రావడంతో గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయన నివాసంతో పాటు సన్నిహితుల ఇళ్ల పైన దాడులు చేశారు. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తులు ఆదాయానికి మించి భారీగా శ్రీనివాసులు సమకూర్చారని గుర్తించారు. శ్రీనివాస్ కు ఆస్తులు చూసిన అధికారులే ఆశ్చర్య పోతున్నారు. ఇప్పటివరకు ఏసీబీ గుర్తించిన ఆస్తులను పరిశీలిస్తే…. ఆయన కూడా పెట్టిన ఆస్తుల వివరాలు

మై హోం భుజాలో ఒక ఫ్లాట్
నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ / రైస్ మిల్
కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి
అనంతపూర్లో 11 ఎకరాలు
మహబూబ్ నగర్లో 4 ప్లాట్లు
నారాయణపేటలో మరో 3 ప్లాట్లు
దాడుల్లో స్వాధీనం చేసిన విలువైన వస్తువులు:
రూ. 5 లక్షల నగదు
1.6 కిలోల బంగారం
770 గ్రాముల వెండి ఆభరణాలు
వాహనాలు:
కియా సెల్టోస్ హైక్రాస్ కార్
ఇన్నోవా కార్
ఏసీబీ ప్రకారం, పట్టుబడిన ఆస్తుల మార్కెట్ విలువ పత్రాల్లో చూపిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.






Leave a Reply