(హైదరాబాద్,న్యూస్ ఇన్)

రెండె నెలల క్రితం పెళ్లైన నవ దంపతులు అనుమాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా రైలు పట్టాల కింద పడి ఇద్దరు నవ దంపతుల మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సింహాచలం, భవానీ గా గుర్తించారు. హైదరాబాద్ లో ఉంటున్న ఈ నవదంపతులు విజయవాడలోని తమ బంధుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం రైలులో బయలు దేరినట్లు తెలుస్తోంది.రైలులో ప్రయాణిస్తూ డోర్ దగ్గర నిలుచుండడంతో జారీపడిపోయారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






Leave a Reply