NewsInn

News in a Click

కేసీఆర్, వైఎస్ జగన్ భారీగా ఫ్లెక్సీలు

వైఎస్ జగన్, కేసీఆర్ సంక్షేమానికి చిరునామా

రెండు రాష్ట్రాల్లో రాబోయేది సంక్షేమ పాలననే

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ సీఎం కేసీఆర్, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో పాటు వైఎస్ జగన్ కలిసి ఉన్న కటౌట్ లు అమరావతి, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, విజయవాడలో వెలిశాయి. సంక్షేమ ప్రధాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలుపుతూ శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ ఎస్ నాయకులు రవీందర్ యాదవ్ వీటిని ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ వర్గాల్లో విపరీంతంగా చర్చ సాగింది.

ఈ మధ్య కేటీఆర్, జగన్ సైతం బెంగళూరులో కలవడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, తాడేపల్లి, విజయవాడలో కేసీఆర్, కేటీఆర్, జగన్ కలిసి ఉన్నట్లుగా కటౌట్ లు కనిపించడంతో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ, భారాస మధ్య బలమైన దోస్తీ కొనసాగుతుందని చెబుతూ, వచ్చే ఎన్నికల్లో ఇటు కేసీఆర్, అటు జగన్ అధికారంలోకి రాబోతున్నారనే సందేశాన్ని ఇచ్చేలా కటౌట్ లు ఏర్పాటు చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్, వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు సంక్షేమం, అభివృద్ధిలో ముందు ఉండాలంటే కేసీఆర్, వైఎస్ జగన్ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *