NewsInn

News in a Click

కోహెడ నుంచి చేప‌ల ఎగుమ‌తి మంత్రి శ్రీహ‌రి

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ‌లో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ స్థలాన్ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప‌రిశీలించి ప‌ల సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ… 13 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఫిష్ మార్కెట్ 2027 మార్చి లోపు ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇది అత్యంత ఆధునిక ప‌ద్ధ‌తుల్లో నిర్మిస్తామ‌ని ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి అన్నారు. ఈ మార్కెట్ నుండి గోదావరి, కృష్ణ న‌దీ జ‌లాల‌తో పెంచే మ‌త్స్య సంప‌ద‌తో పాటు రాష్ట్రంలో ఉన్న 26 వేల నీటి వనరుల్లో లభించే చేపలను విదేశాలను ఎగుమతి చేస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. మార్కెట్ నిర్మాణం కోసం రు.47 కోట్ల‌ను వెచ్చిస్తున్నామ‌ని, అవ‌స‌ర‌మైతే మ‌రిన్నినిదులు కేటాయించేందుకు కూడా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *