(హైదరాబాద్, న్యూస్ఇన్)
గురుకుల విద్యాసంస్థలను దేశంలోనే ఆదర్శ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు .గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (TGSWREIS) సొసైటీ పరిధిలో నిర్మించిన నూతన మినీ బ్లాక్ భవనాన్ని సోమవారం మంత్రి అడ్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ లోని సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా విస్తరిస్తున్నామని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో
విద్యార్థులకు మెరుగైన బోధన వాతావరణంతో పాటు విద్యా, పరిపాలనా కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా నాణ్యతతో పాటు వసతుల అభివృద్ధికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలోటీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి కంభంపాటి శారద, జాయింట్ సెక్రెటరీ సక్రు నాయక్, విజయలక్ష్మి అడిషనల్ సెక్రటరీ డి.శ్రీనివాస్ జాయింట్ సెక్రెటరీ తదితర అధికారులు పాల్గొన్నారు.













Leave a Reply