(న్యూస్ఇన్, హైదరాబాద్)
జాతీయ జెండాను కప్పుకున్నా….కాంగ్రెస్ కండువా వేసుకోలేదు.. ఇటీవల సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే బీఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలు మార్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మార్పు తప్పలేదని గతంలో చెప్పిన ఆయన కొత్త వాదనను పోచారం ఇప్పుడు మొదలు పెట్టారు.
సీనియర్ నేతగా రాజకీయాల్లో గుర్తింపు ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే ప్రాధాన్యత దక్కకపోవడంతో.. ప్రభుత్వం, అధికారులు సమస్యలు ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదని వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు కూడా చేయడంతో సీఎం కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో యుద్ధ ప్రాతిపదికన విందు సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించే విధంగా వ్యవహరించారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ రాజకీయాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ రాజకీయాలను ఒంట బట్టిచుకున్న సీఎం రేవంత్ రెడ్డి పోచారం డిమాండ్లకు తల ఉపే స్థాయిని ఎప్పుడో దాటి పోయారు. దీంతో పోచారం తన రాజకీయ అనుభవంతో నియోజవర్గంలో కొత్త వాదదను వినిపిస్తూ……తనను ఎవరూ కొనలేరు..కాని తన ఆదాయాన్ని కాపాడుకుంటా అన్న చందంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న ప్రచారం మొదలైంది.

ప్రాంతీయ పార్టీలో అధినేతలను ప్రసన్నం చేసుకున్నంత సులువుగా జాతీయ పార్టీలో పోచారం కు సాధ్యం కావడం లేదు. సుధీర్ఘ రాజకీయ అనుభవమున్నా…. పోచారం చేస్తున్న వ్యాఖ్యలు రెంటికి చెడ్డ రేవడిగా మారుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సీనియర్ నేతకు ఎంతో ప్రాధాన్యత నిచ్చినా……దాన్ని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఆదాయం కోల్పోకుండా కాంగ్రెస్ లో చేరినట్లు తీవ్ర ఆరోపణలు పోచారంతో పాటు కుటుంబ సభ్యులపై ఉన్నాయి. తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు పోచారం ఇమేజ్ ను మరింత డ్యామెజ్ చేసే విధంగా మారుతున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికూడా పోచారం చేసిన వ్యాఖ్యలను పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ ఫిరాయించిన సమయంలో ఇచ్చిన సమయంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న చర్చ కూడా ఉంది.మరో రెండేళ్లలో ఎన్నికల నేప|థ్యంలో సీనియర్ నేతల వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బంది కరంగా కూడా మారే అవకాశం ఉన్నాయి..అయినా ఫిరాయింపు ఎమ్మెల్యేల డిమాండ్లకు తొలొగ్గితే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేల నుంచి ఎదరయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చన్న వాదన మొదలైంది. పొచారం సన్నాయి నొక్కులకు సీఎం రేవంత్ దిగి వచ్చే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. పోచారం చేస్తున్నవ్యాఖ్యలు రాజకీయంగా పట్టు కోల్సోతున్నారన్న దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్న చర్చకూడా వినిపిస్తోంది.
జాతీయ కండువా వేసుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించినా హస్తిన వెళ్లి రాహూల్ గాంధీతో ఎందుకు భేటీ అయ్యారో… ఆయన లేవనెత్తే ప్రజా సమస్యలు రాహూల్ గాంధీ పరిష్కారం చూపిస్తారని భావించారో ఏమో మరి….. సీనియర్ నేత కదా ఆమాత్రం ఆలోచించకపోతే రాజకీయంగా ఆయనకు గుర్తింపు దక్కడం కష్టమే.












Leave a Reply