(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల మధ్య చెత్త పంచాయతీ ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పంచాయతీ ఉద్రిక్తతకు దారితీసింది. ఎందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణకు సరిహద్దు పట్టణమైన బీదర్ మున్సిపల్ అధికారులు తెలంగాణ ప్రాంతంలోని మళ్లీ గ్రామ శివారులో చెత్తను పారబోస్తూ డంపింగ్ యార్డ్ గా వినియోగించుకుంటున్నారు. ఈ కారణంగా మా గ్రామంలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని గ్రామస్తులు అధికారులకు ఎన్నో సార్లు తెలియ చేశారు. బీదర్ మున్సిపల్ అధికారులు పంపించే చెత్తను గత 15 రోజులుగా అడ్డుకుంటున్న తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు.చెత్త వాహనాలను అడ్డుకున్న వారిపై బీదర్ మున్సిపల్ అధికారుల బెదిరింపులుకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.బీదర్ కి ఎలా వస్తారో చూస్తాం అంటూ మల్గి- బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్త పారబోసి మున్సిపల్ అధికారులు వెళ్లి పోవడంతో బీదర్-మల్గి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 11 రోజులుగా ఈ పరిణామాలు ఎదురవుతున్న పరిష్కరించే దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.












Leave a Reply