NewsInn

News in a Click

ఆదాయం పై తెలంగాణా స‌ర్కార్ ఫోక‌స్

ఆదాయం పై తెలంగాణా స‌ర్కార్ ఫోక‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో ఆదాయం పెరిగేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై స‌ర్కార్ దృష్టి పెట్టింది. ఆదాయ స‌మీక‌ర‌ణ వ‌న‌రుల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఆదాయం పెరిగేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎం అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ఆదాయంలో కీల‌కంగా ఉండే HMDA, TGIIC శాఖ‌ల అధికారులు దృష్టి సారించాల‌ని, వీటితో పాటు కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత వహించాలని సూచించారు.

CM Revanth Reddy Review on Finanace

అధికారులు ఆదాయ స‌మీక‌ర‌ణ‌పై ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేసుకుని నిరంతరం అప్రమ‌త్తంగా ఫాలోఅప్ చేయాల‌న్నారు. ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే శాఖ‌ల వారిగా టార్గెట్ విధించికుని అధికారులు ప్ర‌ణాళిక బ‌ద్ధంగా ముందుకు వెళ్లాల‌ని సీఎం సూచించారు.AI టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను DBT కి అనుసంధానం చేసుకోవాల్సిన అవ‌స‌రంఉంద‌న్నారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్ ను తయారు చేసుకోవాలి దీంట్లో భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర‌బ‌డ్జెట్ ఊహ‌జ‌నితంగా ఉండ‌రాద‌ని, వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేలా బ‌డ్జెట్ రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే స‌హ‌కారం అందించేందుకు ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంటుందని, అదే విధంగా అధికారులు నిధుల స‌మీక‌ర‌ణ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *