(న్యూస్ఇన్,హైదరాబాద్)
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారాయి. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలోని ములుగు, పరకాల నియోజకవర్గాల్లో పర్యటించారు.ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పరకాలలో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ జిల్లా రాజకీయాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా దీవించాలని సీఎం రేవంత్ కోరారు. ఈ వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఎక్కడా కనిపించని మంత్రి కొండా సురేఖ తెరవెనక చక్రం తిప్పడం మొదలు పెట్టారు. తన కూతురు సుష్మితను రంగంలోకి దించింది. ఇక యువనేత సుష్మిత చేసిన కామెంట్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. రేవూరి ప్రకాశ్ రెడ్డికి పరకాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అదే విధంగా మంత్రి పొంగులేటి సహా సీఎంపై విమర్శలు గుప్పించారు. దీంతో పాటు తన సోషల్ మీడియా అకౌంట్ లో పరకాల తరువాతి ఎమ్మెల్యే కొండా సుష్మిత అనే పోస్టర్ దర్శన మించింది. దీంతో పరకాల నియోజకవర్గంపై కొండా కుటుంబం రాజకీయంగా పట్టు నిలుపుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెప్పకనే చెప్పినట్లయింది.
పార్టీతో సంబంధం లేకుండానే అక్కడ రాజకీయం చేసేందుకు అనుగుణంగా కొండా ఫ్యామిలీ చక్రం తిప్పుతుండడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే…అందుకు కౌంటర్ గా కొండా సుష్మిత రంగంలోకి దిగడం జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా మారుతోంది. గతంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య కూడా విబేధాలు బయట పడ్డాయి. ఇక తాజాగా సీఎం పర్యటన అనంతరం సుష్మిత చేసిన వ్యాఖ్యలు అటు పార్టీలో ఇటు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని ఎలా చక్క బెడుతుందని ఆసక్తి రేపుతోంది.
సుష్మిత వ్యాఖ్యలు….సురేఖకు నోటీసులు….
మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఈ రోజు పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీనియర్ శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపై మూడు రోజులలో వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ గారిని ఆదేశించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఇటీవల వనపర్తి నియోజక వర్గంలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై, స్థానిక ఎమ్మెల్యే పై చేసిన అనుచిత ప్రసంగాల పై మూడు రోజులలో వివరణ ఇవ్వాలని ఆదేశించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
వ్యక్తిగత విషయాలపై దూషించడమే కాకుండా కులాల పేరుతో దూషించిన సంఘటనలపై సరైన ఆధారాలు ఉండడం తో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ని సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ










Leave a Reply