NewsInn

News in a Click

ఘ‌నంగా క్రిస్మ‌స్ – వేడుక‌ల్లో నేత‌లు

ఘ‌నంగా క్రిస్మ‌స్ – వేడుక‌ల్లో నేత‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

వికారాబాద్ లో గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్

క్రిస్మ‌స్ వేడుకుల‌ను ప్ర‌జ‌లు ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకున్నారు. ప‌లువురు నేత‌లు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌క్రిస్ మ‌స్ వేడుకుల‌ను నిర్వ‌హించుకున్నారు.క్రిస్మస్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని మెథడిస్ట్ చర్చీలో జరిగిన వేడుకలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఏసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ నెలలోనే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గారు పుట్టింది కూడా డిసెంబర్ నెలలోనే అని డిసెంబ‌ర్ నెల ప్ర‌త్యేక‌త‌ను చెప్పారు.

బ‌య్యారం లో భ‌ట్టి విక్ర‌మార్క‌…

125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక బయ్యారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొని, ప్రభువు ఆశీస్సులు అందుకున్నారు.ప్రేమ, శాంతి, సహజీవన విలువలతో రాష్ట్ర ప్రజలంతా ఏకమై ముందుకు సాగాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ప్రభువును ప్రార్థించినట్లు తెలిపారు.ప్రభువు ఏ సందేశాన్ని అయితే మానవాళికి అందించారూ ఇతరుల కోసం, వారి ఇబ్బందుల నుంచి బయట పడేయడం కోసం ఎలా జీవించాలో ప్రభువు జీవితం మనకు నేర్పిస్తుంది అన్నారు.

గ‌చ్చిబౌలిలో పీసీసీ చీఫ్….

గచ్చిబౌలిలో క్రిస్మస్ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జీసస్ క్రైస్తవులకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి దేవుడని వ్యాఖ్యానించారు.జీసస్ జీవితం, ఆయన చరిత్ర మానవాళికి గొప్ప సందేశం అన్నారు.

నాంపల్లిలో క‌విత‌…..

నాంపల్లి చాపెల్ రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తన చిన్ననాటి నుంచి మెథడిస్ట్ చర్చితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు

టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి…..

సంగారెడ్డి పట్టణంలోని పలు చర్చ్ లలో నిర్వహించిన వేడుకల్లో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. మొదటగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆసుపత్రి సిబ్బంది, పేషంట్ల సమక్షం లో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంగారెడ్డి లోని మెథడిస్ట్ చర్చ్, సి ఎస్ ఐ చర్చ్, రాక్ చర్చ్, హోసన్ చర్చ్, సౌందర్య సీయోను చర్చ్ లలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చర్చి లలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు… అనంతరం మత పెద్దలు, పాస్టర్ లతో కలసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. .చర్చి పెద్దలు నిర్మలా జగ్గారెడ్డిని సన్మానించారు. మెథ‌డిస్ట్ చ‌ర్చితో ఉన్న అనుబంధాల‌ను ఆమె గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *