పబ్ లు, హోటళ్ల లైసెన్సులు రద్దు
హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిపై ప్రభుత్వం ఈగల్ టీం లను ఏర్పాటు చేసి ఓ వైపు చర్యలు తీసుకుంటుంటే మరో వైపు నగరంలో జీరో డ్రగ్ సిటీగా మార్చాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పావులు కదుపుతున్నారు. కొత్త సంవత్సరం నుంచి ఇందుకు సంబంధించి అడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. కొత్త సంవత్సరం కదా అని డ్రగ్స్ విక్రయాలు జరిపి పట్టుబడితే అలాంటి హోటళ్లు, పబ్ ల లైసన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హెచ్-న్యూ, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆయా విభాగాలకు పలు సూచనలు చేశారు.

శుక్రవారం నుంచే నగరంలోని పబ్లు, హోటళ్లు రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించాం. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా మా నిఘా ఉంటుంది. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలను నిశితంగా గమనిస్తున్నాం. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటు పడిన వారి జాబితా సిద్ధం చేసి వారిపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించాం. నగరానికి కొత్తగా వచ్చేవారి వివరాలనూ ఆరా తీస్తున్నాం’’ అని సీపీ సజ్జనర్ అన్నారు.పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకే మూసివేయాలన్నారు. సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ వేడుకలపై కూడా నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులందరూ సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్టను పెంచాల






Leave a Reply