NewsInn

News in a Click

అజీజ్ న‌గ‌ర్ లో హ‌రీష్ ఫాంహౌస్ కూల్చాలి

రేవంత్ రెడ్డి సంస్కారం ఉన్న వ్యక్తి

అమెరికాలో చ‌దువుకున్నా కేటిఆర్ కు సంస్కారం లేదు

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్)

సోష‌ల్ మీడియాను అడ్డు పెట్టుకుని కేసిఆర్, కేటిఆర్ లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ విషం చిమ్ముతున్నార‌ని ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే తాము చూస్తూ ఊరుకోమ‌ని మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత్ రావ్ హెచ్చ‌రించారు. మాజీ మంత్రి హ‌రీష్ రావ్ అజీజ్ న‌గ‌ర‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫాం హౌస్ నిర్మాణం చేశార‌ని, దీనిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. హైడ్రా అధికారుల‌తో వెంట‌నే ఫాం హౌస్ ను కూల‌గొట్టాల‌న్నారు.

గాంధీ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో బీఆర్ ఎస్ నేత‌ల‌పై మైనంప‌ల్లి మండిప‌డ్డారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో పోలీసులతో వేధించి అక్ర‌మంగా పార్టీలో చేర్చుకున్న చ‌రిత్ర బీఆర్ ఎస్ పార్టీద‌ని వ్యాఖ్యానించారు. నాయ‌కుల‌ను, మంత్రుల‌ను కొనుగోలు చేయ‌లేదా అని కేసిఆర్ కేటిఆర్ ల‌ను ప్ర‌శ్నించారు. రు. మీ లాగా మేము వ్య‌వ‌హ‌రిస్తే మీ అడ్ర‌స్ గ‌ల్లంత‌వ్వ‌డం ఖాయ‌మ‌న్నారు. మీరు మాట్లాడే విధంగానే మేము భాష వాడితే త‌ట్టుకోలేర‌ని హెచ్చ‌రించారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హాయంలో కంటోన్మెంట్ భూములు, అసైన్డ్ భూముల‌ను అమ్మి దోచుకున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆంధ్రా వాళ్ళను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రాజ‌కీయాల్లోకి బూతు భాష‌ను బీఆర్ ఎస్ తెచ్చింద‌న్నారు. అమెరికా లో చదువుకున్నా కేటిఆర్ కు సంస్కారం లేద‌ని,చ‌దువు కోక పోయినా సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం ఉన్న వ్యక్తి అని మైనంప‌ల్లి కితాబునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *