గాంధీ పేరు బీజెపీకి నచ్చడం లేదు
కుట్రతో ఉపాధి హామీ పథం నుంచి పేరు తొలగించారు.
(హైదరాబాద్,న్యూస్ ఇండియా)
కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్బావ దినోత్సవాలను పీసీసీ నేతలు గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ…ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్స్వాతంత్య్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేనిదన్నారు.నెహ్రూ ప్రధాని కాకుండా ఉంది ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేని వ్యాఖ్యానించారు.

ఆయన పోషించిన పాత్ర వల్లే నేడు దేశం ఈ స్థాయికి ఎదిగిందన్నారు. పాకిస్థాన్ కు ఇందిరాగాంధీ అంటే గడగడ లాడే పరిస్థితి ఉండేది….కానీ ఈనాడు మోడీ మాత్రం పాకిస్థాన్ కు భయ పడుతున్నాడుతన ఆర్థిక సంస్కరణలతో పీవీ నరసింహారావు.. దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ లకు మేలు చేసే విధానాలు తప్ప… ప్రజల గురించి మోడీ ప్రభుత్వం అస్సలు ఆలోచన చెయ్యడం లేదని ఆరోపించారు.అన్ని వర్గాలకు సరైన ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్రంలో కులగణణ సర్వే చేశారని,బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చెయ్యాలని చూస్తే.. బిజెపి అడ్డం పడిందని, బీజేపీ విధానాలకు బిఆర్ ఎస్ వంత పాడుతోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరు లో గాంధీ పేరు తొలగించడం బిజెపి చేస్తున్న కుట్ర అని మంత్రి పొన్నం ప్రభావకర్ ఆరోపించారు. గాంధీ పేరు బీజెపి కి నచ్చడం లేదని మరో మంత్రి అజహారుద్దీన్ వ్యాఖ్యానించారు.



Leave a Reply