ప్రజా సమస్యలు చర్చకు రావు
అసెంబ్లీని ఏడాదికి 20 రోజులు నడపడం లేదు
మీడియాతో హరీష్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీ సమావేశాల పనిదినాలు తగ్గపోతున్నాని, ప్రతిపక్షంపై బురద చల్లేందుకే అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏమాత్రం చిత్త శుద్ధితో పనిచేయడం లేదన్నారు. బీఆర్ ఎస్ పార్టీ ప్రతిపాదించిన ఒక్క అంశంపై కూడా ప్రభుత్వం చర్చకు అంగీకరించడం లేదని ఇది ఎంత వరకు సమంజసమని హరీష్ ప్రశ్నించారు.

అంగబలంతో అసెంబ్లీని కాంగ్రెస్ నడిపిసోతందని ఆరోపించారు.కృష్ణా జలాల్లో 45 టీఎంసిలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారా లేదా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి పథకం ప్రాజెక్టుపై ఏడాది క్రితం డీపిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందినా ఇప్పటి వరకు ఎంతుకు తిరిగి సబ్మిట్ చేయలేదని హరీష్ రావ్ ప్రశ్నించారు. ఈ సారి అసెంబ్లీని 15 రోజులు నడిపించాలని బీఆర్ ఎస్ డిమాండ్ చేస్తోందని, ప్రభుత్వం అసెంబ్లీలో ఏ అంశం చర్చకు తెచ్చినా తాము సిద్దంగా ఉన్నామన్నారు. అసెంబ్లీలో బీఆర్ ఎస్ పార్టీ కంటే తక్కువ సభ్యులున్న పార్టీలకు ఎక్కువ అవకాశం కల్పిస్తూ తమకు మాత్రం స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని, మాకు తగిన సమయం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు అసెంబ్లీ హౌస్ కమిటీలు వేయకపోవడంలో లోపం ఎక్కడుందన్నారు.

ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డిని నియమిస్తే వెంటనే రాజీనామా చేశారని,పీఏసీ చైర్మన్ పదవికి బ్యాక్ గేట్ నుంచి నామినేషన్లు తీసుకుని చైర్మన్ ను ఎంపిక చేశారని ఆరోపించారు. ఈసారి సమావేశాల్లో కృష్ణా జలాలతో పాటు ఎరువుల కొరత,రైతు బంధు ఎగ్గొట్టిన దానిపై,రుణమాఫీ,పంట బోనస్ పై చర్చ పెట్టాలన్నారు.5 లక్షల కోట్ల హిల్ట్ పాలసీ కుంభకోణంపై,జాబ్ క్యాలెండర్ పై నాచర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చ బీఏసీ సమావేశంలోనే జరగాలని పట్టు పడతామన్నారు.కృష్ణా జలాలను తిరిగి రాష్ట్రాలకు పంచితేనె న్యాయం జరుగుతుందని చెప్పారు.



Leave a Reply